అలరించిన మహతీ మధురిమలు
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై ఆదివారం మహతీ మధురిమలు 303వ కార్యక్రమం జరిగింది. మహతీ స్వరసుధా వ్యవస్థాపక అధ్యక్షురాలు పత్రినిర్మల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని టీసీహెచ్ భాస్కరరావు, భాగ్యలక్ష్మి, ఆలయ పాలకమండలి అధ్యక్షులు చిట్టిపోతు మస్తానయ్య ప్రారంభించారు. పాడుతా తీయగా ఫేమ్ ఏ. లలిత యశస్వి, పి.శాంతిశ్రీ రాజ్యలక్ష్మి, జరీనా, ప్రసన్న లక్ష్మి తదితరులు సినీ, భక్తి గీతాలను ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వీరికి కె.రవిబాబు, ఎస్.వెంకట్, చంద్ర వాయిద్య సహకారాన్ని అందించారు. కార్యక్రమాన్ని మదన్మోహనరావు నిర్వహించగా, ఏవీకే సుజాత వ్యాఖ్యాతగా వ్యవహరించారు.


కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి