ముగిసిన సుందరకాండ పారాయణం
స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, అన్నమయ్య కళావేదికపై భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం సుందరకాండ ఆరవ అధ్యాయం పారాయణము జరిగింది. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, బొల్లేపల్లి సత్యనారాయణ, లలి తాంబ దంపతులు తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎం.ఎస్. రామారావు రచించిన సుందరకాండలోని ఆరవ అధ్యాయంలోని శ్లోకాలను వెంపటి సత్యనారాయణ తమ గాత్రధారణలో చక్కగా ఆలపించి భావం వివరించగా, ప్రముఖ కవి అయినాల మల్లేశ్వరరావు విశ్లేషణ చేస్తూ సుందరకాండ ఆరవ అధ్యాయంలో లంకా నగరంలో హనుమంతుడి సీతాన్వేషణ కొనసాగుతుందన్నారు. సీతమ్మను వెతుకుతూ హనుమంతుడు రావణుడి అంతః పురంలోకి ప్రవేశిస్తాడన్నారు. అక్కడ బంగారు స్తంభాలు, రత్నాలు పొదిగిన గోడలతో శోభిల్లే రావణుడి భవనాల అపార వైభవాన్ని, విలాసవంతమైన వాతావరణాన్ని చూసి ఆశ్చర్యపోతాడన్నారు. అయినప్పటికి, తన ప్రధాన లక్ష్యాన్ని మరువకుండా రావణుడి మందిరాలలోని ప్రతి మూలను, అంతఃపుర స్త్రీల నివాసాలను ఎంతో నిశితంగా పరిశీలిస్తూ హనుమంతుడు తన అన్వేషణను ముందుకు సాగిస్తాడని తెలియజేశారు.



కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి