అలరించిన నృత్య ప్రదర్శన స్థానిక బృందావన గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఆదివారం రాత్రి జరిగిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రాధామాధవ నాట్యక్షేత్రం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో అన కాపల్లి సిరి స్పందన నృత్యా లయ విద్యార్థినులు గురు గిరిజా స్పందన దర్శకత్వంలో నృత్యాలు ప్రదర్శించారు. అలాగే డాక్టర్ ప్రపుల కలపటపు (హైదరాబాద్) కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగాయి. కార్యక్ర మాలను సంస్థ కార్యదర్శి షేక్ ఖలీల్ నిర్వహించారు.
మహాభారతంపై ఆధ్యాత్మిక ప్రవచనం
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో అన్నమయ్య కళావేదికపై సోమవారం మహాభారతం అరణ్యపర్వంపై ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. తొలుత ఆలయ పాలక మండలి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గుదిమెళ్ల శ్రీకూర్మనాధస్వామి మాట్లాడుతూ మహాభారంతో అరణ్యపర్వం అత్యంత గొప్పగా వర్ణించబడిందన్నారు.


కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి