రామానుజాచార్య జీవిత విశేషాలపై ఆధ్యాత్మిక ప్రవచనము
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ వారి సౌజన్యంతో శ్రీ భగవత్ రామానుజ తిరునక్షత్ర (జయంతి) మహోత్సవములు సందర్భంగా బుధవారం రామానుజాచార్య జీవిత విశేషాలు, యతిరాజ వింశతిపై ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్, మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, యడ్లపాటి అశోక్ కుమార్ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ సాహితీవేత్త గుదిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామి ప్రవచిస్తూ రామానుజాచార్యులు విశిష్టాద్వైత సిద్ధాంత కర్తగా, గొప్ప సామాజిక విప్లవకారుడిగా భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో నిలిచిపోయారన్నారు. భగవంతుని చేరుకోవడానికి భక్తి, శరణాగతి మాత్రమే మార్గాలని బోధిస్తూ, కులమత భేదాలకు అతీతంగా అందరికీ మోక్షం లభించాలని ఆయన ఆకాంక్షించారన్నారు. సాహితీవేత్త కె.వి.ఎల్.ఎన్. అప్పలాచార్యులు ప్రవచిస్తూ యతిరాజ వింశతి అనేది శ్రీ రామానుజాచార్యుల వైభవాన్ని కొనియాడుతూ శ్రీ వరవరమునులు రచించిన ఒక విశిష్టమైన స్తోత్రమన్నారు. రామా సుజుల దయాగుణాన్ని, వారి జ్ఞాన వైభవాన్ని మరియు విశిష్టాద్వైత సిద్ధాంత స్థాపనలో వారు చేసిన కృషిని కవి అత్యంత సుందరంగా వర్ణించారన్నారు. అసిస్టెంట్ సూపరెస్టెండెంట్ ఆఫ్ పోలీస్ ఎ.. హనుమంత్ ప్రసంగిస్తూ రామునికి అనుజుడు రామానుజుడున్నారు. పేదలందరికి దేవాలయ దర్శనం కల్పించాలని అన్నారన్నారు. వాక్కు విచక్షణా జ్ఞానం, పంచధర్మాలను ఎలా ఉపయోగించుకోవాలనేదే ధర్మమన్నారు.
.jpeg)
.jpeg)
.jpeg)





కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి