నాగలక్ష్మీమహతికి స్వర్ణపతకంతో సన్మానం
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీపద్మావతి గోదా సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవా లయం అన్నమయ్య కళావేదికపై గత రెండు రోజు లుగా నిర్వహిస్తోన్న గాయత్రీ మహిళా సంగీత సన్మండలి 29వ వార్షిక సభ ఆదివారం ముగిశాయి. సభకు సన్మండలి అధ్యక్షురాలు, ప్రముఖ న్యూరాలజిస్ట్ పి.విజయ అధ్యక్షత వహించారు. ప్రత్యేక సంచికను చీఫ్ కార్డియాలజిస్ట్ పీవీ రాఘవశర్మ, సన్మండలి గౌరవాధ్యక్షులు అన్నవరపు రామస్వామి, ఆలయ పాలకమండలి అధ్యక్షులు సిహెచ్. మస్తానయ్యలు ఆవిష్కరించారు. అనంతరం గాయకురాలు పెరవలి నాగలక్ష్మీ మహతికి స్వర్ణ పతకం ప్రదానం చేయగా, న్యూరాలజిస్ట్ పి.విజయను సత్కరించారు. తదుపరి శాస్త్రీయ సంగీత గాత్ర కచేరీలో పెరవలి నాగలక్ష్మీమహతి వాగ్గేయ కీర్తనలను అలపించారు. వయోలిన్పై సుబ్రహ్మణ్యరాజు, మృదంగంపై సీహెచ్ సూర్య వాయిద్యాన్ని అందించారు. సభాధ్యక్షత వహించిన న్యూరాలజిస్ట్ పి.విజయ మాట్లాడుతూ గత 29 ఏళ్లుగా సన్మండలి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నా రు. సభలో ఉపాధ్యక్షులు మాధవపెద్ది విజయలక్ష్మి, పి.లలిత, కార్యదర్శి ఏవీ మంగాదేవి పాల్గొనగా అతిథులను, కళాకారులను సత్కరించారు.


కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి