అలరించిన శాస్త్రీయ సంగీత కచేరి
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీపద్మావతి గోదా సమేత శ్రీవేంకటేశ్వరస్వామి దేవా లయం అన్నమయ్య కళావేదికపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న గాయత్రీ మహిళా సంగీత సన్మండలి 29వ వార్షిక వేడుకలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలుత న్యూరాలజిస్ట్ ఎస్ఎస్ హరిత, ఆలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్.మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, నిర్వాహకులు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. డాక్టర్ పాల్టాట్ ఆర్ రాంప్రసాద్ (చెన్నై) శాస్త్రీయ సం గీత కచేరి నిర్వహించారు. త్యాగరాజ కృతులు, వాగ్గేయకార కీర్తనలు అలపించారు. వయోలిన్పై తిరుచ్చరై కార్తిక్, మృదంగంపై బుర్ర శ్రీరామ్(చెన్నై), ఘటంపై మార్టూరు హరిబాబు (గుంటూరు) వాయిద్యాన్ని అందించారు. కార్యక్రమంలో సన్మండలి ప్రధాన కార్యదర్శి ఎంవై.శేషురాణి, ఉపాధ్య క్షులు డాక్టర్ రాజరాజేశ్వరి, పాటిబండ లలిత, మాధవపెద్ది విజయలక్ష్మి, కార్యదర్శి ఏవీ మంగాదే వి, కోశాధికారి ఎం. విజయలక్ష్మి పాల్గొనగా, కళాకారులను, అతిథులను సత్కరించారు.


కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి