ముగిసిన ఎన్టీఆర్ కళాపరిషత్ నాటకోత్సవాలు
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావే దికపై నిర్వహిస్తున్న ఎన్టీఆర్ కళాపరిషత్ 21వ నాటకోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. కె.ఆర్.కె. ఈవెంట్స్ ఆధ్వర్యంలో రంగస్థల ప్రము ఖులకు గౌరవ సత్కారం, సినీ సంగీత విభావరి నిర్వహించారు. అనంతరం ఎన్.టి.ఆర్. నటించిన పలు చిత్రాల డాక్యుమెంటరీ ప్రదర్శించారు. ఈ సభకు రామకృష్ణప్రసాద్ కాట్రగడ్డ అధ్యక్షత వహిం చారు. ఆలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, బొప్పన నరసింహారావు, డాక్టర్ లంకా లక్ష్మీనారాయణ, జి.మల్లికార్జునరావు, ఎస్వీ రామారావు, మన్నె శ్రీనివాస్ (రేపల్లె), సూర్యదేవర జగన్నాధ రావు(విజయవాడ), నడింపల్లి వెంకటేశ్వరరావు ( సాతులూరు), గుదే పాండురంగారావు (అనంతపు రం)లను సత్కరించారు. సభానంతరం నిర్వహించిన సినీ సంగీత విభావరి అలరించింది. కార్యక్ర మంలో ఆర్.వెంకట్రావు, టి.సుబ్బారావు, ఎ.పాపా రావు, ఎన్. శేషు పాల్గొన్నారు.





కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి