అలరించిన నృత్య ప్రదర్శన స్థానిక బృందావన గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఆదివారం రాత్రి జరిగిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రాధామాధవ నాట్యక్షేత్రం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో అన కాపల్లి సిరి స్పందన నృత్యా లయ విద్యార్థినులు గురు గిరిజా స్పందన దర్శకత్వంలో నృత్యాలు ప్రదర్శించారు. అలాగే డాక్టర్ ప్రపుల కలపటపు (హైదరాబాద్) కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగాయి. కార్యక్ర మాలను సంస్థ కార్యదర్శి షేక్ ఖలీల్ నిర్వహించారు.
ఉగాది వేడుకల్లో సంస్కృతి సౌరభం
గుంటూరు నాగార్జున సాంస్కృతిక కేంద్రం, నాగార్జున మ్యూజిక్ కాలేజ్ ఆధ్వర్యంలో అన్నమయ్య కళావేదికలో ఉగాది వేడుకలు నిర్వహించారు. నోరి నారాయణమూర్తి పంచాంగ శ్రవణం నిర్వహించి సంవత్సర ఫలితాలను వివరించారు. అనంతరం నిర్వహించిన కవిసమ్మేళనంలో కవులు తమ కవితలతో అలరించారు. ఈ కార్య క్రమానికి ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ ఏడుకొండలు ముఖ్య అతిథిగా హాజయ్యారు. ఉ గాది పండగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అన్నారు.




కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి