ముగిసిన వైకే నాగేశ్వరరావు స్మారక నాటకోత్సవాలు
స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీవేం కటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదిక మీద కళా విపంచి, యువకళావాహిని సంయుక్త నిర్వహణలో వైకే నాగేశ్వరరావు జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న నాటకోత్సవాలు శనివారం రాత్రితో ముగిశాయి. చివరి రోజున చెరుకూరి సాంబశివరావు రచన దర్శకత్వాల్లో ఉషోదయ కళానికేతన్ కట్రపాడు వారు 'మంచి మనసులు' నాటికను ప్రదర్శించారు. తొలుత జరిగిన సభకు లంక లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. యడ్లపాడు వేదిక సంస్థ అధ్యక్షుడు ముత్తవరపు సురేష్ బాబు, మేకల మోహనరావు, డోగిపర్తి శంకరరావు, రామరాజు లక్ష్మీశ్రీనివాస్, ఆలయ పాలకమండలి సహాయ కార్యదర్శి వూటుకూరి నాగేశ్వరరావు తదితరులు కార్యక్రమాలను ప్రారంభించారు. ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన జి. మల్లికార్జునరావును కళావిపంచి అధ్యక్షుడు బొప్పన నరసింహారావు. పలు కళాసంస్థల వారు, స్నేహితులు, ఆలయ పాలకమండలి, పలువురు ప్రముఖులు జీవన సాఫల్య పురస్కారమిచ్చి సత్కరించారు. అనంతరం సూర్యలలిత యశస్వికి వైకే నాగేశ్వరరావు స్మారక పురస్కారమిచ్చి సత్కరించారు.

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి