అలరించిన వ్యంగ్య హాస్య నాటికలు
స్థానిక బృందావన్ గార్డెన్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై తెలుగు నాటకరంగ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న నాటకోత్సవాలు గురువారం రెండో రోజుకి చేరాయి. ఆరాధన ఆర్ట్స్ అకాడమీ గుంటూరు ఆధ్వర్యంలో ఏపీ సృజనాత్మకత, సంస్కృతి సమితి సౌజన్యంతో జరగ్గా, ఆలయ పాలకమండలి ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, అతిథులు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం బండారు అచ్చమాంబ పురస్కారాన్ని డాక్టర్ ప్రగతికి, కొరప్రాటి గంగాధరరావు పురస్కారాన్ని బి.రామనాయక్కి తెలుగు నాటక రంగ పురస్కారాలు, ఆత్మీయ పురస్కారాన్ని గాయకులు కొట్టపాటి రామారావుకి ప్రదానం చేసి సత్కరించారు. సభానంతరం కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్య శతజయంతిలో భాగంగా ఎక్కిరాల కులపతి కృష్ణమాచార్య రచించిన నడింపల్లి వెంకటేశ్వరరావు దర్శకత్వం వహించిన బండారుపల్లి వెంకయ్య మెమోరియల్ ఆర్ట్స్ (లింగారావుపాలెం) ప్రజాదినం వ్యంగ్య నాటిక, పధివీ నాటక కళాపరిషత్ (హైదరాబాద్) ఆధ్వర్యంలో శ్రీశుక రచించగా, జి.విజయబాబు దర్శకత్వంలో ఉంగరపు వేళ్ళు అనే నాటికలను ప్రదర్శించారు. ఈ నాటికలు చక్కటి సందేశాలతో అలరించాయి. కళాకారులను, అతిథులను సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు డి.తిరుమ లేశ్వరరావు, నడింపల్లి వెంకటేశ్వరరావు సత్కరించారు. గొట్టిపాటి రామారావు బృందం అలపించిన సినీ మధుర గీతాలు అలరించాయి. అకాడమీ గౌరవాధ్యక్షులు బొల్లేపల్లి శ్రీనివాసరావు, డాక్టర్ జొన్నలగడ్డ నిహారిక పాల్గొన్నారు.


కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి