అలరించిన నృత్య ప్రదర్శన స్థానిక బృందావన గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఆదివారం రాత్రి జరిగిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రాధామాధవ నాట్యక్షేత్రం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో అన కాపల్లి సిరి స్పందన నృత్యా లయ విద్యార్థినులు గురు గిరిజా స్పందన దర్శకత్వంలో నృత్యాలు ప్రదర్శించారు. అలాగే డాక్టర్ ప్రపుల కలపటపు (హైదరాబాద్) కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగాయి. కార్యక్ర మాలను సంస్థ కార్యదర్శి షేక్ ఖలీల్ నిర్వహించారు.
అజ్ఞానాన్ని తొలగించే ఉపనిషత్తులు
ఉపనిషత్తులు వేదాల చివరి భాగమని, బ్రహ్మ విద్య, ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మికత సారాంశాన్ని తెలియజేస్తాయని చిన్మయమిషన్ సువీరానందస్వామి అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై సోమవారం జరుగుల బంగారుబాబు, శివకుమారి దంపతుల సౌజన్యంతో 'ఉపనిషత్ స్రవంతి' అంశంపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. సువీరానందస్వామి మాట్లాడుతూ మనిషిలోని అజ్ఞానాన్ని తొలగించి, సత్యం, మోక్ష మార్గాన్ని ఉపనిషత్తులు బోధిస్తాయన్నారు.
.jpeg)


కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి