ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అలరించిన పౌరాణిక పద్య నాటకాలు - 26.01.2026

అలరించిన పౌరాణిక పద్య నాటకాలు స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ నిర్వాహకులు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతుల ఆధ్వర్యంలో సంస్థ 32 వ వార్షిక ఉత్సవాలలో భాగంగా డాక్టర్ దేవరపల్లి ప్రభుదాస్ నిర్వహణలో పౌరాణిక పద్య నాటక సన్నివేశ ప్రదర్శన జరిగింది. మొదటిగా గయోపాఖ్యానంలోని సన్నివేశాన్ని ప్రదర్శించారు. శ్రీకృష్ణుడుగా డాక్టర్ దేవరపల్లి ప్రభుదాస్, అర్జునుడిగా ఉల్లంగుల బ్రహ్మయ్య, రెండవదిగా శ్రీకృష్ణరాయబారం పడకసీనులోని సన్నివేశాన్ని ప్రదర్శించారు. శ్రీకృష్ణుడుగా గుర్రపుశాల శ్రీనివాస్, సుయోధనుడుగా అట్ల రామకృష్ణారెడ్డి, అర్జునుడుగా బ్రహ్మయ్యలు పౌరాణిక పద్యాలతో ఆహుతులను అలరించారు. అనంతరం ఆలయ పాలక మండలి సభ్యులు డాక్టర్ ప్రభుదాస్ దంపతులను, కళాకారులను ఘనంగా సత్కరించారు.

విలాసిని పద్యకావ్య పుస్తకావిష్కరణ - 16.01.2026

విలాసిని పద్యకావ్య పుస్తకావిష్కరణ

బృందావన్గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం ఆవరణలో అన్నమయ కళావేది కపై విలాసిని పద్య కావ్యం పుస్తకావిష్కరణ నిర్వ హించారు. కళాస్రవంతి, సాహితీ స్రవంతి సంస్థ అధ్యక్షుడు డాక్టర్ దేవరపల్లి ప్రభుదాసు పుస్తకాన్ని రచించారు. ఆలయ పాలక మండలి అధ్యక్షులు సి.హెచ్.మస్తానయ్య, విశ్రాంతి జాయింట్ రిజిస్ట్రారు మాణిక్యలరావు సభా పరిచయం చేశారు. కార్యక్రమంలో కవి రచయిత డాక్టర్ సూర్యదేవర రవికుమార్, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, విశ్రాంత ఆచార్య కళాస్రవంతి తాళ్లూరు వెంకటరత్నం పాల్గొన్నారు. చింతామణిలోని భావ ఘట్టాన్ని ప్రదర్శించారు. కళాకారులను సత్కరించారు.




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన - 25.10.2025

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ - 17.07.2025

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయంలో బుధవారం శ్రీవారికి అత్యంత వైభవోపేతంగా తిరుప్పావడసేవ కార్యక్రమం జరిగింది. తొలుత వేదపండితులు మాధవస్వామి బృందం ఆధ్వర్యంలో స్వామి ఉత్సవమూర్తులకు విశేష అర్చనలు, అభిషేకాలు, అలంకరణ జరిగాయి. స్వామి దివ్యదృష్టి పడే విధంగా మహామండపంలో పెద్ది శ్రీనివాసరావు, శ్రీలత దంపతులు సమర్పించిన మేల్‌చాట్ వస్త్రం, చిత్రాన్న రాశిలో జిలేబి, వడ, అప్పాలు, లడ్డులు, దోశలులను ఒక దీర్ఘ చతురస్రాకారంగా 18 అంగుళాల ఎత్తున ఏర్పాటు చేశారు. అష్టదిక్కులు, ఆరాధనలు జరిపి వివిధ రకాల పూలమాలతో తిరుప్పావడపై అలంకరించారు. వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీనివాస గద్యాన్ని శ్రవణానందంగా పఠించారు. అధిక సంఖ్యలో భక్తులు తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు. ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, సభ్యులు, భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

వైభవంగా పుష్పయాగం - 06.11.2025

వైభవంగా పుష్పయాగం - 06.11.2025 బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ పాలకవర్గం సహాయ, సహకారాలతో కొండబోలు శివరామప్రసాద్, ఉమాశంకర్ దంపతుల సౌజన్యంతో కార్తికమా సాన్ని పురస్కరించుకొని పుష్పయాగం జరిగింది. తొలుత మూలవిరాట్టుకు పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పూజలు, అలంకరణ జరి గాయి. చామంతి, గులాబీ, లిల్లీ, కలువలు, మల్లెలు, మరువం, జాజి పూలు, తులసీ దళాలతో పుష్ప యాగో త్సవం జరిగింది. ఈసందర్భంగా స్వామివారికి బంగారు పంచె కోసం శివరామప్రసాద్, ఉమాశంకర్ దంప తులు రూ.50 వేలు సమర్పించారు. సాహితీవేత్త నారాయణం ప్రసాదాచార్యులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మునిపల్లె రమణి భక్తి గీతాలాపన చేశారు.