ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

సేవకు ప్రతిరూపం మాదల శకుంతల - 13.05.2026

సేవకు ప్రతిరూపం మాదల శకుంతల సేవకు ప్రతిర ప్రతిరూపం దివంగత మాదల శకుంతల అని పలువురు కీర్తించారు. బుధవారం మాదల శకుంతల ద్వితీయ వర్ధంతి సందర్భంగా స్థానిక బృందావనగార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదిక మీద కార్యక్రమాలు జరిగాయి. తొలుత పురాణ దర్శనం గ్రంథావిష్కరణ సభ జరిగింది. సభకు డాక్టర్ చిలకపాటి విజయరాఘవాచార్యులు అధ్యక్షత వహించారు. సుప్రసిద్ధ పండితులు డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ. గ్రంథ ప్రచురణ దాత, గ్రంథ స్వీకర్త ధార్మికరత్న మాదల రత్నగిరి బాబు, గ్రంథ రచయిత డాక్టర్ జయంతి చక్రవర్తి తదితరులు మాదల శకుంతల జీవిత విశేషాలను, ఆదర్శ గుణగణాలను వివరించారు. ఈ సందర్భంగా 500 మంది వృద్ధులకు, అనాథలకు అన్నదానం, పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ పాటిబండ్ల శివాజీ, డాక్టర్ పూజ తదితరులు పాల్గొన్నారు.

వేడుకగా నాటక రంగ పురస్కారాల ప్రదానం - 15.04.2026

వేడుకగా నాటక రంగ పురస్కారాల ప్రదానం

స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, అన్నమయ్య కళావేదికపై ఆరాధన ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత, సంస్కృతీ సమితి వారి సౌజన్యంతో ప్రముఖ రంగస్థల నటులకు తెలుగు నాటకరంగ పురస్కారాల ప్రధానోత్సవ సభ బుధవారం జరిగింది. సభకు సంస్థ గౌరవ అధ్యక్షుడు బొల్లేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా, అతిథులుగా ఏపి నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, డాక్టర్ కొండబోలు కృష్ణప్రసాద్, డాక్టర్ కొసరాజు కళాధర్, మంగళగీరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ధర్మకర్త మేకల మోహనరావు, ఆలయ కమిటి అధ్యక్షుడు సిహెచ్ మస్తానయ్యలు పాల్గొని నాటక రంగ విశిష్టతపై ప్రసంగించారు. అనంతరం డాక్టర్ ముత్తవరపు సురేష్బాబును విశ్వకళాసారధి, వల్లూరు వెంకట్రామయ్య చౌదరి పురస్కారాన్ని నరసయ్యకు, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పురస్కారాన్ని గుడివాడ శ్రీనివాసరావుకు అందజేశారు.






కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన - 25.10.2025

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ - 17.07.2025

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయంలో బుధవారం శ్రీవారికి అత్యంత వైభవోపేతంగా తిరుప్పావడసేవ కార్యక్రమం జరిగింది. తొలుత వేదపండితులు మాధవస్వామి బృందం ఆధ్వర్యంలో స్వామి ఉత్సవమూర్తులకు విశేష అర్చనలు, అభిషేకాలు, అలంకరణ జరిగాయి. స్వామి దివ్యదృష్టి పడే విధంగా మహామండపంలో పెద్ది శ్రీనివాసరావు, శ్రీలత దంపతులు సమర్పించిన మేల్‌చాట్ వస్త్రం, చిత్రాన్న రాశిలో జిలేబి, వడ, అప్పాలు, లడ్డులు, దోశలులను ఒక దీర్ఘ చతురస్రాకారంగా 18 అంగుళాల ఎత్తున ఏర్పాటు చేశారు. అష్టదిక్కులు, ఆరాధనలు జరిపి వివిధ రకాల పూలమాలతో తిరుప్పావడపై అలంకరించారు. వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీనివాస గద్యాన్ని శ్రవణానందంగా పఠించారు. అధిక సంఖ్యలో భక్తులు తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు. ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, సభ్యులు, భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

వైభవంగా పుష్పయాగం - 06.11.2025

వైభవంగా పుష్పయాగం - 06.11.2025 బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ పాలకవర్గం సహాయ, సహకారాలతో కొండబోలు శివరామప్రసాద్, ఉమాశంకర్ దంపతుల సౌజన్యంతో కార్తికమా సాన్ని పురస్కరించుకొని పుష్పయాగం జరిగింది. తొలుత మూలవిరాట్టుకు పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పూజలు, అలంకరణ జరి గాయి. చామంతి, గులాబీ, లిల్లీ, కలువలు, మల్లెలు, మరువం, జాజి పూలు, తులసీ దళాలతో పుష్ప యాగో త్సవం జరిగింది. ఈసందర్భంగా స్వామివారికి బంగారు పంచె కోసం శివరామప్రసాద్, ఉమాశంకర్ దంప తులు రూ.50 వేలు సమర్పించారు. సాహితీవేత్త నారాయణం ప్రసాదాచార్యులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మునిపల్లె రమణి భక్తి గీతాలాపన చేశారు.