వేడుకగా నాటక రంగ పురస్కారాల ప్రదానం
స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, అన్నమయ్య కళావేదికపై ఆరాధన ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సృజనాత్మకత, సంస్కృతీ సమితి వారి సౌజన్యంతో ప్రముఖ రంగస్థల నటులకు తెలుగు నాటకరంగ పురస్కారాల ప్రధానోత్సవ సభ బుధవారం జరిగింది. సభకు సంస్థ గౌరవ అధ్యక్షుడు బొల్లేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా, అతిథులుగా ఏపి నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, డాక్టర్ కొండబోలు కృష్ణప్రసాద్, డాక్టర్ కొసరాజు కళాధర్, మంగళగీరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ధర్మకర్త మేకల మోహనరావు, ఆలయ కమిటి అధ్యక్షుడు సిహెచ్ మస్తానయ్యలు పాల్గొని నాటక రంగ విశిష్టతపై ప్రసంగించారు. అనంతరం డాక్టర్ ముత్తవరపు సురేష్బాబును విశ్వకళాసారధి, వల్లూరు వెంకట్రామయ్య చౌదరి పురస్కారాన్ని నరసయ్యకు, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పురస్కారాన్ని గుడివాడ శ్రీనివాసరావుకు అందజేశారు.


కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి