సందేశాత్మకంగా సాగిన కమనీయం నాటిక
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర నాటక అకాడమి సౌజన్యంతో శ్రీ సద్గురు కళానిలయం రజతోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న నాటకోత్సవాల మూడో రోజు సోమవారం ప్రదర్శించిన కమనీయంనాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత శ్రీ రామనామ క్షేత్రం నిర్వహణ అధ్యక్షులు బెల్లంకొండ మస్తాన్ రావు, రాగం వెంకట లీలా సుందరి దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంగీత విధ్వంసురాలు బెజవాడ భువనేశ్వరి ప్రార్ధన గీతాన్ని ఆలపించారు. శుభగాత్రి ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకులు నాట్యాచార్య బీరకాయ సురేష్ బాబు శిష్య బృందం పలు కీర్తనలకు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు హిందూ కళాశాల విశ్రాంత వైస్ ప్రిన్సిపాల్ కెవిఎస్ దుర్గాప్రసాద్ అధ్యక్షత వహించారు. సభలో ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు రంగస్థల కళల శాఖ అధిపతి డాక్టర్ జి. ఎస్. ప్రసాదరెడ్డి, భారతీయ విద్యా భవన్ కార్యదర్శి పి.రామచంద్రరాజు, ప్రముఖ రంగస్థల, సినీ నటుడు, దర్శకుడు నాయుడు గోపి, దూరదర్శన్ న్యూస్ కరస్పాండెంట్ ముదిగొండ రవిశంకర్, ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి ఊటుకూరు నాగేశ్వరరావు, తదితరులు పాల్గొని ప్రముఖ ప్రముఖ రంగస్థలం నటి గుడివాడ లహరి ని ఘనంగా సత్కరించారు. సభానంతరం విద్యాధర్ మునిపల్లె రచనకు బసవరాజు జయశంకర్ దర్శకత్వం వహించిన కమనీయం నాటికను ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇందులో బసవరాజు జయశంకర్, ఎన్. సూర్య,డి. వేణుగోపాల్ రెడ్డి, గుడివాడ లహరి నటించారు. కీబోర్డుపై కె. వి. రమణ, మృదంగంపై ప్రభల రమణ, వయోలిన్ పై పాణ్యం దక్షిణామూర్తి వాయిద్య సహకారం అందించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి