ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అలరించిన నృత్య ప్రదర్శన - 05.04.2026

అలరించిన నృత్య ప్రదర్శన స్థానిక బృందావన గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఆదివారం రాత్రి జరిగిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రాధామాధవ నాట్యక్షేత్రం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో అన కాపల్లి సిరి స్పందన నృత్యా లయ విద్యార్థినులు గురు గిరిజా స్పందన దర్శకత్వంలో నృత్యాలు ప్రదర్శించారు. అలాగే డాక్టర్ ప్రపుల కలపటపు (హైదరాబాద్) కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగాయి. కార్యక్ర మాలను సంస్థ కార్యదర్శి షేక్ ఖలీల్ నిర్వహించారు.

వైభవంగా మార్గదర్శి ఎం.డి. శైలజాకిరణ్ కు ధర్మ జ్యోతి పురస్కార ప్రదాన సభ - 14.06.2026

ఉమ్మడి కుటుంబ వ్యవస్థతో నైతిక విలువల పరిరక్షణ

సమాజంలో ధర్మం.. నీతి నిలిచి ముందుతరాలకు నైతిక విలువలు అందడానికి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎంతగానో ఉపకరిస్తుందని ముస్సోరి లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ పూర్వ ప్రొఫెసర్ డాక్టర్ ఆరేటి కృష్ణకుమారి అన్నారు. శనివారం రాత్రి బృందావన గార్డెన్స్ వెంక టేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై స్వధర్మ సేవాసంస్థ ఆధ్వర్యంలో మార్గదర్శి ఎం.డి. శైలజాకిరణ్ కు ధర్మ జ్యోతి పురస్కార ప్రదాన సభ జరిగింది. సభకు సంస్థ అధ్యక్షుడు కొర్రపాటి రామారావు అధ్యక్షత వహించారు. కృష్ణకుమారి మాట్లాడుతూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థతో సమాజంలో నేరప్రవృత్తి తగ్గుతుందన్నారు. పిల్లలకు కుటుంబ సభ్యులతో మాట్లాడే అవ కాశం ఉంటుందని తద్వారా వారు ధర్మమార్గంలో నడవడానికి అవకాశం ఉంటుందన్నారు. పురస్కార గ్రహీత మార్గదర్శి ఎం.డి. శైలజాకిరణ్ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఉన్నందువల్లనే ఇంత సమర్థంగా వృత్తి, సేవారంగాల్లో నెగ్గగలుగుతున్నారన్నారు. ఆలయ పాలకమండలి అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య మాట్లాడుతూ ఇంతకుముందు ఆలయ పాలకమండలికి కార్యదర్శిగా పనిచేసిన గుమ్మడి రాధాకృష్ణమూర్తి స్వధర్మ సేవా సంస్థకు శ్రీకారం చుట్టారని, ఆలయానికి అనుబంధంగా మహాప్రస్థానం, స్వధర్మ సేవాసంస్థ, అన్నమయ్య గ్రంథాలయం తదితరాలను నెలకొల్పారన్నారు. సంస్థ అధ్యక్షుడు కొర్రపాటి రామారావు సంస్థ ఆవిర్భావ వికాసాలను వివరించారు. ప్రసంగికులందరూ సీహెచ్ శైలజాకిరణ్ ధైర్యాన్ని, మార్గదర్శి అభివృద్ధిలో ఆమె చూపుతున్న సమర్ధతను కొనియాడారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మొక్కవోని దీక్షతో ముందడుగు వేస్తున్నారని ప్రశంసించారు. ఆనంతరం మార్గదర్శి ఎం.డి. శైలజాకిరణ్ కి ధర్మజ్యోతి పురస్కారాన్ని సుప్రీం కోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ఫీ రమణ ప్రదానం చేసి సత్కరించారు. ఈ సందర్భంగా కంచికామకోటి పీఠ పంచాంగాన్ని ఆవిష్కరించారు.










కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన - 25.10.2025

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ - 17.07.2025

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయంలో బుధవారం శ్రీవారికి అత్యంత వైభవోపేతంగా తిరుప్పావడసేవ కార్యక్రమం జరిగింది. తొలుత వేదపండితులు మాధవస్వామి బృందం ఆధ్వర్యంలో స్వామి ఉత్సవమూర్తులకు విశేష అర్చనలు, అభిషేకాలు, అలంకరణ జరిగాయి. స్వామి దివ్యదృష్టి పడే విధంగా మహామండపంలో పెద్ది శ్రీనివాసరావు, శ్రీలత దంపతులు సమర్పించిన మేల్‌చాట్ వస్త్రం, చిత్రాన్న రాశిలో జిలేబి, వడ, అప్పాలు, లడ్డులు, దోశలులను ఒక దీర్ఘ చతురస్రాకారంగా 18 అంగుళాల ఎత్తున ఏర్పాటు చేశారు. అష్టదిక్కులు, ఆరాధనలు జరిపి వివిధ రకాల పూలమాలతో తిరుప్పావడపై అలంకరించారు. వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీనివాస గద్యాన్ని శ్రవణానందంగా పఠించారు. అధిక సంఖ్యలో భక్తులు తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు. ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, సభ్యులు, భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

వైభవంగా పుష్పయాగం - 06.11.2025

వైభవంగా పుష్పయాగం - 06.11.2025 బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ పాలకవర్గం సహాయ, సహకారాలతో కొండబోలు శివరామప్రసాద్, ఉమాశంకర్ దంపతుల సౌజన్యంతో కార్తికమా సాన్ని పురస్కరించుకొని పుష్పయాగం జరిగింది. తొలుత మూలవిరాట్టుకు పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పూజలు, అలంకరణ జరి గాయి. చామంతి, గులాబీ, లిల్లీ, కలువలు, మల్లెలు, మరువం, జాజి పూలు, తులసీ దళాలతో పుష్ప యాగో త్సవం జరిగింది. ఈసందర్భంగా స్వామివారికి బంగారు పంచె కోసం శివరామప్రసాద్, ఉమాశంకర్ దంప తులు రూ.50 వేలు సమర్పించారు. సాహితీవేత్త నారాయణం ప్రసాదాచార్యులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మునిపల్లె రమణి భక్తి గీతాలాపన చేశారు.