రాజనీతిలో రాముడే ఆదర్శం
ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు
భరతుడికి శ్రీరాముడు చేసిన ధర్మోపదేశం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శం కావాలని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అన్నారు. గుంటూరు, బృందావన్ గార్డెన్స్, శ్రీ వేంకటేశ్వర దేవస్థానం, అన్నమయ్య కళావేదికపై గుళ్ళపల్లి సుబ్బారావు సేవాసంస్థ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే గరికపాటి ప్రవచనాల కార్యక్రమం శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలుత శ్రీవేంకటేశ్వర దేవస్థానం వెబ్సైట్, యూప్ను దేవస్థానం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మస్తానయ్య, బొర్రా ఉమామహేశ్వరరావు, గుళ్ళపల్లి సుబ్బారావు, గుళ్ళపల్లి రాఘవేంద్ర రావుతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం రామాయణంలో రాజనీతిపై గరికపా టి ప్రవచించారు. రాజు అనేవాడు ఇంద్రియాలకు లొంగిపోకూడదు. పొగడ్తలకు పొంగిపోరాదు. అపరాధులను నేరం రుజువైన తరువాతే శిక్షించాలి. యువతలో దైవనామస్మరణ, ఆధ్యాత్మిక భావాలు పెంపొందించగల్గితే తద్వారా ధర్మ, చింతన పరోపకారకాలు సిద్ధి స్తాయని అన్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ప్రోత్సహిస్తే నాటి రాముడి రాజ్యం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజధాని నగరంలో దేవాలయాల నిర్మాణం జరగడం శుభ సూచికమని, తద్వారా ప్రజలలో ఆధ్యాత్మి భావాలు, దైవచింతన పెరుగుతాయని రుగుతాయని అన్నారు. తొలుత వందేమాతరం 150సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సభికులచే వందేమాతరం నినాదాన్ని చేయించారు. ఈ కార్యక్రమంలో ఏ సృజనకుమార్ దంపతులు, స్నేహ, చిట్టినేని శివ కోటేశ్వరరావు, బొల్లేపల్లి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి