సద్గురు కళా నిలయం నాటకోత్సవాలు ప్రారంభం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేది కపై శ్రీ సద్గురు కళా నిలయం నాటకోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి, రాష్ట్ర నాటక అకాడమీ సౌజన్యంతో ఈ నాటకోత్సవాలు జరుగుతున్నాయి. విజమ్ స్కూల్ ప్రిన్సిపాల్ సగుటూరి శారద జ్యోతి ప్రజ్వలన చేయగా, సంగీత విద్వాంసురాలు బి.శ్రీలక్ష్మి ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. శ్రీ సాయి మంజీరా కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకులు నాట్యాచార్య డాక్టర్ కాజా వెంకట సుబ్రహ్మణ్యం శిష్య బృందం పలు కీర్తనలకు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు. ప్రముఖ రచయిత నాటక విశ్లేషకులు డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు సభకు అధ్యక్షత వహించారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, ఆలయ కమిటీ అధ్యక్షుడు మస్తానయ్యలు ప్రముఖ రంగస్థల నటి ముత్యాల లక్ష్మీతులసిని ఘనంగా సత్కరించారు. ఆకెళ్ళ సూర్యనారాయణ రచనకు బసవరాజు జయశంకర్ దర్శకత్వం వహించిన సహప్రయాణం నాటికను ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.



కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి