ఎండోక్రైనాలజీ సమస్యలపై అవగాహన
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం అన్నమయ్య కళావేదికపై సోమవారం జనరల్ అండ్ ఎండోక్రైనాలజీ సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. కిమ్స్ శిఖర హాస్పిటల్, గుంటూరు జిల్లా సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. వైద్యులు ఉమామహేశ్వర ఆర్.గొలమారి మాట్లాడుతూ ఎండోక్రైనాలజీ శరీరంలోని హార్మోన్లు, ఎండోక్రైన్ గ్రంథులను అధ్యయనం చేసే వైద్య విభాగమని అన్నారు. జీవక్రియ, పెరుగుదల, పునరుత్పత్తి, మూడ్ వంటి కీలక విధులను నియంత్రిస్తాయని పేర్కొన్నారు. అకస్మాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం, తీవ్రమైన అలసట, జుట్టు రాలడం, అధిక దాహం, నెలసరిలో సమ స్యలు వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సం ప్రదించాలని అన్నారు. పలువురి సందేహాలకు నివృత్తి చేశారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు మన్నె సుబ్బారావు, సభ్యులు కోగంటి బసవనంది కేశ్వరరావు, దశరథ్ పాల్గొన్నారు.



కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి