ఘనంగా అయ్యంకి-వెలగా పురస్కారాల ప్రదానం
బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానం లోని అన్నమయ్య కళావేదికపై అన్నమయ్య సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యంకి-వెలగా పురస్కా రాల ప్రదాన సభ శుక్రవారం రాత్రి జరిగింది. తొలుత గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య, గ్రంథాలయ గాంధీ డాక్టర్ వెలగా వెంకటప్పయ్య చిత్రపటాలకు అతిథులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, డిజైనింగ్, ప్రింటింగ్ ప్రెస్ రంగ ప్రముఖుడు కటకం వెంకటప్రసాదరా వులకు రూ.పది వేల నగదుతో పాటు గ్రంథా లయ సేవా పురస్కారాలను ప్రదానం చేశారు. పావులూరి ట్రస్ట్ వ్యవస్థాపకుడు పావులూరి శ్రీనివాసరావుకు పార్వతీపురంలోని జట్టు ఆశ్రమం సంస్థ వారు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. అనంతరం 'ఆధునిక సమాజంలో పాఠకులు-వీక్షకులు' అనే అంశంపై అయినాల మల్లేశ్వరరావు మాట్లాడారు. అతిథులను నిర్వాహకులు సత్కరించారు. జేఎన్టీయూ పూర్వ ప్రొఫెసర్ ఆచార్య అయ్యంకి మురళీకృష్ణ, విశాఖ స్టీల్ ప్లాంట్ విశ్రాంత అధికారి వెలగా వెంకట్రావు, జాస్తి శివరామకృష్ణ, గోలి లక్ష్మయ్య, బొల్లేపల్లి సత్యనారాయణ, పెద్ది సాంబశివరావు, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు డాక్టర్ కొల్లు పారినాయుడు, డాక్టర్ కొలసాని రామ చంద్ తదితరులు పాల్గొన్నారు.





కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి