అలరించిన అలనాటి సినీ సౌరభాలు
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై ఆదివారం సాయంత్రం అలనాటి సినీ సౌరభాలు నిర్వహించారు. మహతీ స్వరసుధ వ్యవస్థాపకులు పత్రీ నిర్మల ఆధ్వర్యంలో నిర్వహించగా, ఆలయ పాలకమండలి అధ్యక్షులు సి.హెచ్.మస్తానయ్య, సహాయ కార్యదర్శి వూటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం సినీ సౌరభాలు 302వ కార్యక్రమంలో భాగంగా గాయకులు రాజ్యలక్ష్మి, జరీనా, హేమమాలిని, హారిక, డాక్టర్ రచిత, ప్రసన్నలక్ష్మి, ప్రద్యుమ్న, డాక్టర్ మురళీబాబూరావు, ఆనంద్, డాక్టర్ ఎ.వీర రాఘవ, కృష్ణప్రసాద్ అలనాటి సినీ సౌరభాలను అలపించారు. కీబోర్డుపై రవిబాబు, తబలాపై ఎస్. వెంకట్, ప్యాడ్స్పై కె.చంద్ర వాయిద్యాన్ని అందించారు. కార్యక్రమంలో ఏపీ హైకోర్టు న్యాయవాది శశాంక భువనగిరి, సీనియర్ గాయని కంచర్ల శకుంతల, మదన్మోహన్రావు పాల్గొనగా, ఏవీకే సుజాత వ్యాఖ్యనం చేశారు.



కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి