అనిరుద్దుని చరిత్రపై ప్రవచనం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గురువారం అనిరుద్ధుని చరిత్రపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటీ సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త నారాయణం శేషుబాబు ప్రవచిస్తూ అనిరుద్దుడు శ్రీకృష్ణుని మనవడని, ప్రద్యుమ్నుడు రుక్మావతిల కుమారుడన్నారు. ఇతను అత్యంత పరాక్రమ వంతుడనీ, శ్రీకృష్ణునిలాగే ఉండేవాడని, విష్ణువు అంశ అని చెబుతారన్నారు. బాణాసురుని కుమార్తె ఉషను స్వప్నంలో చూసి ప్రేమించి, ఆమెను వివాహం చేసుకోవడం, శ్రీకృష్ణుడు, బలరాముడు, ప్రద్యుమ్నులు బాణానురునిపై యుద్ధం చేసి, శివుని సహాయం ఉన్నప్పటికీ బాణాసురుణ్ణి ఓడించి అనిరుద్ధుణ్ణి ఉషతో పాటు ద్వారకకు తీసుకురావడం వంటి విశేషాలను తెలియజేశారు.



కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి