అత్యంత పవిత్రమైన గణపతి అథర్వ శీర్షమ్
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై మంగళవారం సాయంత్రం గణపతి అథర్వ శీర్షమ్ ఉపనిషత్పై ప్రవచన నిర్వహించారు. తొలుత ఆలయ కమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు కె.వి. కోటేశ్వరరావు ప్రవచిస్తూ గణపతి అథర్వ శీర్షమ్ అనేది అథర్వణ వేదానికి చెందిన అత్యంత పవిత్రమైన ఉపనిషత్తు అని అన్నారు. వినాయకుడే పంచ భూతాలుగా, కాలత్రయానికి, అవస్థాత్రయానికి అతీతుడైన పరమాత్మగా విరాజి ల్లుతున్నాడని పేర్కొన్నారు. ఆయన మూలమంత్ర మైన ఓం గం గణపతయే నమః అంతరార్థాన్ని శాస్త్రీ యంగా వివరించారని తెలిపారు. ఈ అథర్వ శీర్షాన్ని నిత్యం పఠించడం వల్ల సమస్త విఘ్నాలు, పాపాలు తొలగిపోయి, బుద్ధి వికాసం, మనశ్శాంతి, ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషా ర్థాలు సిద్ధిస్తాయని, దీని ఫలశ్రుతి చెబుతుందని ఆయన వివరించారు.



కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి