మహాభారతంపై ప్రవచనం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై సోమవారం మహాభారతం అరణ్యపర్వంలోని పతివ్రతా మహాత్మ్యంపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ పాలకమండలి వారు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గుదిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామి ప్రవచిస్తూ, మహాభారతంలో ప్రతివ్రతా మహా త్మ్యం అత్యంత గొప్పగా వర్ణించబడిందన్నారు. స్త్రీ పాతి వ్రత్య శక్తికి, నిష్కల్మషమైన ప్రేమకు ప్రతీకగా నిలు స్తుందన్నారు. పాండవుల భార్య ద్రౌపది, సావిత్రి వంటి పాత్రల ద్వారా పతివ్రతలు తమ పాతివ్రత్యం వల్ల యముడిని కూడా జయించగలరన్నారు. భర్తను మృత్యువు నుండి కాపాడుకోగలరని, కష్టాలను అధిగ మించగలరని ఈ కావ్యం నిరూపిస్తుందన్నారు. పాతివ్రత్యం అనేది స్త్రీకి లభించే గొప్ప శక్తిగా, అది ఆమె కుటుంబాన్ని, భర్తను కాపాడుతుందని స్పష్టం చేస్తుందన్నారు.




కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి