సమాజానికి చారిత్రక నవలలు అవసరం
ప్రస్తుత సమాజానికి చారిత్రక నవలలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని శ్రీశారదానికేతన్ కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వి.రంగనాయకి అన్నారు. శుక్రవారం రాత్రి బృందావన్గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై కోగంటి సీతారామానుజాచార్యులు శత జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ ఎ.వి. దక్షిణామూర్తి రచించిన మధురా దాక్షిణ్యం పుస్తక పరిచయ సభనిర్వహించారు. సభకు హిందూ కళాశాల విశ్రాంత తెలుగు విభాగాధిపతి డాక్టర్ యల్లాప్రగడ మల్లికా ర్జునరావు అధ్యక్షత వహించారు. డాక్టర్ శ్రీరంగనా యకి మాట్లాడుతూ పేరాల భరతశర్మ రచించిన సుప్రసిద్ధ చారిత్రక నవల మధురా విజయానికి అనుశీలనగా దక్షిణామూర్తి రచించిన మధురా దాక్షిణ్యము మధురా విజయాన్ని గొప్పగా విశ్లేషించి చెప్పిందని అన్నారు చారిత్రక అంశాలను విశ్లేషిం చిన తీరుతోపాటు రసాత్మక సన్నివేశాల వర్ణన అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. సభలో మాన సిక వైద్యులు రమణరావు, పేరాల భరతశర్మ తనయులు పేరాల సీతారామప్రభు, వైద్యులు మైల వరపు లలితకుమారిలు ప్రసంగించారు. సభానం తరం డాక్టర్ దక్షిణామూర్తి దంపతులను ఆలయ కమిటి అధ్యక్షులు సిహెచ్.మస్తానయ్య, డాక్టర్ కోగంటి శ్రీరంగనాయకిలు సత్కరించారు.
.jpeg)



కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి