విద్యా సుందరి నాగరత్నమ్మ పురస్కారం
ప్రసిద్ధ నాట్య గురువులు అన్నాబత్తుల లీలా సాయి, మంగతా యారు కళావంతుల కుటుంబంలో జన్మించిన కానీ తన బహుముఖ ప్రజ్ఞా పాటవాలతో దక్షిణ భారతం సాహిత్య సేవా రంగంలో రాణించిన విద్యాసుందరి బెంగళూరు నాగరత్నమ్మ స్మారక పురస్కారం అందు కోవటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ప్రసిద్ధ నాట్య గురువులు అన్నా బత్తుల లీలా సాయి మంగ తాయారులు పేర్కొన్నారు. స్వర్గీయ జే వెంకటేశ్వర రావు ఆకాంక్ష విశ్వనాథ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం అన్నమయ్య కళావేదిక పై సోదరీ మణులందరికీ శాలువా పూలమాలలు జ్ఞాపకాలు నగదు పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కథా రచయిత ఆర్ఎం ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దేవదాసి వ్యవస్థలో అత్యంత గౌరవప్రదమైన స్థానం పొందిన ఎందరో కళామతల్లులు భగవద్ ఆరాధనగా భావించే వారిని కొనియాడారు. అనంతరం పురస్కార గ్రహీతల శిష్యురాలు రిందా శరణ్య కూచిపూడి డాన్స్ అకాడమీ డాక్టర్ యశోద ఠాకూర్ బృందంచే కళావంతుల శైలి భామాకలాపం ప్రదర్శన రసజ్ఞులను ఆనందింపచేసింది.



.jpeg)
.jpeg)


కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి