అలరించిన నృత్య ప్రదర్శన స్థానిక బృందావన గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఆదివారం రాత్రి జరిగిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రాధామాధవ నాట్యక్షేత్రం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో అన కాపల్లి సిరి స్పందన నృత్యా లయ విద్యార్థినులు గురు గిరిజా స్పందన దర్శకత్వంలో నృత్యాలు ప్రదర్శించారు. అలాగే డాక్టర్ ప్రపుల కలపటపు (హైదరాబాద్) కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగాయి. కార్యక్ర మాలను సంస్థ కార్యదర్శి షేక్ ఖలీల్ నిర్వహించారు.
వాల్మీకి రామాయణంలో హనుమత్ వైభవంపై ప్రవచనం
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర్వసామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై హనుమద్వైభవంపై నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక ప్రవచనం రెండో రోజైన శుక్రవారం కొనసాగింది. పీఎస్ఆర్ ఆంజనేయప్రసాద్, గిరిబాల దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించగా, ఆలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్. మస్తానయ్య జ్యోతిప్రజ్వలన చేశారు. శ్రీమన్నారాయణమూర్తి హనుమద్వై భవంపై ప్రవచనాన్ని వినిపించారు. కార్యక్ర మాలను పి.రవికిషోర్, హైమానంద్ పర్యవేక్షించారు.

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి