అలరించిన నృత్య ప్రదర్శన స్థానిక బృందావన గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఆదివారం రాత్రి జరిగిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రాధామాధవ నాట్యక్షేత్రం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో అన కాపల్లి సిరి స్పందన నృత్యా లయ విద్యార్థినులు గురు గిరిజా స్పందన దర్శకత్వంలో నృత్యాలు ప్రదర్శించారు. అలాగే డాక్టర్ ప్రపుల కలపటపు (హైదరాబాద్) కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగాయి. కార్యక్ర మాలను సంస్థ కార్యదర్శి షేక్ ఖలీల్ నిర్వహించారు.
అలరించిన సంగీత విభావరి
బృందావన్గార్డెన్స్ శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానం అన్నమయ్య కళావే దికపై శ్రీహర్ష చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం నీటి ప్రమాదాలపై అవగాహన, సంగీత విభావరి నిర్వహించారు. నిర్వాహకులు అబ్దుల్ ఖాదర్, ఇస్మాయిల్, ఎం రమణి, సుభాషిణీలు భక్తి సినీగీతాలు ఆలపించారు. అనంతరం చిన్నారి నిత్యతేజశ్రీ కూచిపూడి నృత్య ప్రదర్శన అలరించింది. కార్యక్రమంలో సీతారామిరెడ్డి, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ముప్పాళ్ల రమేష్ బాబు, వి.శ్రీకృష్ణ, సాధన శక్తి శ్రీనివాస్, పలువురు మాట్లాడారు. అనంతరం నిర్వాహకులను సత్కరించారు.




కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి