మహా పూర్ణాహుతితో ముగిసిన వెంకటేశుని బ్రహ్మోత్సవాలు
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీపద్మావతి గోదా సమేత శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం పూర్ణాహుతితో ముగిశాయి. ఆలయ ప్రధానార్చకులు పరుచూరి మాధవస్వామి, పరాశరం కృష్ణప్రసాద్ బృందం హోమం నిర్వహించారు. ఉదయం నిత్యపూజలు, చూర్ణోత్సవం, అవబధోత్సవం విశేషంగా జరగ్గా, శ్రీవిరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు(హంపి) విద్యారణ్య భారతిస్వామి మహాపూర్ణాహుతి భక్తిశ్ర ద్ధలతో చేపట్టారు. తొలి రోజు నుంచి హోమాలకు హాజరైన దంపతులు కలశాలతో ఊరేగింపుగా స్వామి వద్దకు చేరుకుని ఆరాధన నిర్వహించారు. రుత్వికులు ధ్వజావరోహణ పూజలు చేపట్టగా, భక్తులకు తీర్థప్రసాదాలు, అన్న సంతర్పణ చేశారు. ఆలయ సత్సంగ్ గోష్టి, లలిత, విష్ణు సహస్ర నామ పారాయణాలు జరిగాయి. ఆలయ పాలకమండలి అధ్యక్షులు సి.హెచ్.మస్తానయ్య, భారతి ధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనా రాయణ, పాలకమండలి ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, సూర్యదేవర వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, కన్నెగంటి బుచ్చయ్యచౌదరి, పుట్టగుంట ప్రభాక రరావు పాల్గొన్నారు.

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి