కనుల పండువగా దివ్య రథోత్సవం
బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి దివ్య రధోత్సవం సోమ వారం రాత్రి కనులపండువగా నిర్వహిం చారు. వేంకటేశ్వర సహస్రనామ హోమం చేశారు. భారతీ ధార్మిక విజ్ఞానపరిషత్తు అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనా రాయణ, లలితాంబ దంపతుల ఆధ్వర్యంలో కోగంటి వెంకట రంగనాయకి బృందం విష్ణు, లలితా సహస్ర నామ, లక్ష్మీ అష్టోత్తర పారాయణలు చేశారు. అనంతరం చండీహోమం, సువాసినులకు చీరలు పంపిణీ చేశారు. సభా కార్యక్రమాల్లో హంపి పీఠాధిపతి విద్యారణ్యభారతి స్వామి, శృంగేరి విరూపాక్ష శ్రీపీఠం పక్షాన పరశివానంద భారతి స్వామి, తపోవనం మాత శివచైతన్యానంద, నిర్వికల్పానందస్వామి పాల్గొని అనుగ్రహభాషణం చేశారు. సాహితీవేత్త డీఎన్. దీక్షిత్, ముప్ప వరపు సింహాచలశాస్త్రి బ్రహ్మోత్సవ విశేషాలను వివరించారు. భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె.జి.శంకర్, డాక్టర్ ఆరేటి కృష్ణకుమారి, సీఐడీ డీఎస్పీ గోలి లక్ష్మయ్య ప్రసంగించారు. ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు, సూర్యదేవర వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, కన్నెగంటి బుచ్చయ్య చౌదరి, పుట్టగుంట ప్రభాకరరావు తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించి అతిథులను సత్కరించారు.


.jpeg)
.jpeg)

.jpeg)


కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి