డిజిటల్ మోసాలపై అవగాహన అవసరం
బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై సోమవారం రాత్రి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, మహిళా విభాగం ఆధ్వర్యంలో డిజిటల్ మోసాలపై అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమంలో సైబర్ మోసాల బారిన పడకుండా ఎవరికి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై హెల్ప్ ఏజ్ ఇండియా స్వచ్చంద సంస్థ తరఫున రాష్ట్ర సమన్వయకర్తగా పులి శ్యామ్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. డిజిటల్, సైబర్ మోసాలు జరిగే తీరుతెన్నులు, వాటి నుంచి రక్షించుకొనే మార్గాలను వివరించారు. ప్రధానంగా మహిళలు, వయోవృద్ధులు ఎలా మోసపోతున్నారో వివరించి.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సాహితీవేత్త ఆచార్య వెలువోలు నాగరాజలక్ష్మి నిర్వహించిన ఈ కార్యక్రమానికి మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ తూనుగుంట్ల రాధాబాయి అధ్యక్షత వహించారు. అనంతరం పులి శ్యామ్ను మహిళా విభాగం, ఆలయ పాలక మండలి సభ్యులు సత్కరించారు.
.jpeg)



కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి