అంగరంగ వైభవంగా శ్రీనివాసుని కల్యాణం
స్థానిక బృందావన్ గార్డెన్స్ గుంటూరు తిరుమలగా ప్రసిద్ధిగాంచిన శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి 27వ వార్షిక బ్రహ్మోత్సవములలో భాగంగా అదివారం ఉదయం నిత్యపూజలు, పాలకమండలి ఉపాధ్యక్షులు లంకా విజయబాబు ఆధ్వర్యంలో బృందావన శ్రీనివాసుని గజ వాహనం పై శోభా యాత్ర తిరువీధులలో నిర్వహించారు. తిరుప్పావై అమృతవర్షిణి డాక్టర్ కోగంటి వెంకట రంగనాయకి గోష్టి బృందంచే లలితా సహస్రనామ పారాయణ అనంతరం తీర్ధ ప్రసాద వినియోగం జరిగింది. సాయంత్రం నవగ్రహ హోమం రుత్వికులు వేదమంత్రాలతో భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఆధ్యాత్మిక సభా కార్యక్రమాలలో త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి అనుగ్రహభాషణం చేశారు. భగవంతునిలో ఉండే దయనే లక్ష్మి అన్నారు. కాలక్షేపము అంటే టైమ్ పాస్ కాదు, యముడిని పక్కకు నెట్టటం అని అన్నారు. ఏ సంప్రదాయమైన ప్రమాణం, ప్రమేయం, ప్రమాత ఈ మూడింటికి విజయం కలగాలని అంటారన్నారు. ప్రమాణం అంటే ఆనందం, వేదం, ఆచార్యులు వీరిని సేవించాలన్నారు. స్వామిని ఎప్పుడు అమ్మవారితో దర్శనం చేసుకుంటే వరాల జల్లు కురిపిస్తారన్నారు. ఉపన్యాసకులుగా గుదిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామి, ఆధ్యాత్మికవేత్త కైలాష్నాధ్ పాల్గొన్నారు. అతిధులుగా ఛైర్మన్ న్యూ హైపరవ్ కమిటి జస్టిస్ యు. దుర్గాప్రసాదరావు, సి.సి.యల్. ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్ చల్లా రాజేంద్రప్రసాద్, సాహితీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి యస్.వి.యస్. లక్ష్మీనారాయణ, లింగంశెట్టి ఈశ్వరరావు, మర్రెడ్డి రామకృష్ణారెడ్డి, దేవినేని కరుణచంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఆలయ అర్చక స్వాములు పి. మాధవస్వామి బృందం ఆధ్వర్యంలో మేళతాళాలతో వేదమంత్రాల నడుమ కళ్యాణాన్ని అంగరంగవైభవంగా నిర్వహించారు. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ, ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు సూర్యదేవర వెంకటేశ్వరరావు, సహాయకార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, కన్నెగంటి బుచ్చయ్యచౌదరి, బండారు సాంబశివరావు తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించి అతిధుల సత్కారం నిర్వహించారు.






.jpeg)


కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి