ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అలరించిన నృత్య ప్రదర్శన - 05.04.2026

అలరించిన నృత్య ప్రదర్శన స్థానిక బృందావన గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ఆదివారం రాత్రి జరిగిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రాధామాధవ నాట్యక్షేత్రం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో అన కాపల్లి సిరి స్పందన నృత్యా లయ విద్యార్థినులు గురు గిరిజా స్పందన దర్శకత్వంలో నృత్యాలు ప్రదర్శించారు. అలాగే డాక్టర్ ప్రపుల కలపటపు (హైదరాబాద్) కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగాయి. కార్యక్ర మాలను సంస్థ కార్యదర్శి షేక్ ఖలీల్ నిర్వహించారు.

అంగరంగ వైభవంగా శ్రీనివాసుని కల్యాణం - 01.03.2026

అంగరంగ వైభవంగా శ్రీనివాసుని కల్యాణం

స్థానిక బృందావన్ గార్డెన్స్ గుంటూరు తిరుమలగా ప్రసిద్ధిగాంచిన శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి 27వ వార్షిక బ్రహ్మోత్సవములలో భాగంగా అదివారం ఉదయం నిత్యపూజలు, పాలకమండలి ఉపాధ్యక్షులు లంకా విజయబాబు ఆధ్వర్యంలో బృందావన శ్రీనివాసుని గజ వాహనం పై శోభా యాత్ర తిరువీధులలో నిర్వహించారు. తిరుప్పావై అమృతవర్షిణి డాక్టర్ కోగంటి వెంకట రంగనాయకి గోష్టి బృందంచే లలితా సహస్రనామ పారాయణ అనంతరం తీర్ధ ప్రసాద వినియోగం జరిగింది. సాయంత్రం నవగ్రహ హోమం రుత్వికులు వేదమంత్రాలతో భక్తి శ్రద్దలతో నిర్వహించారు. ఆధ్యాత్మిక సభా కార్యక్రమాలలో త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి అనుగ్రహభాషణం చేశారు. భగవంతునిలో ఉండే దయనే లక్ష్మి అన్నారు. కాలక్షేపము అంటే టైమ్ పాస్ కాదు, యముడిని పక్కకు నెట్టటం అని అన్నారు. ఏ సంప్రదాయమైన ప్రమాణం, ప్రమేయం, ప్రమాత ఈ మూడింటికి విజయం కలగాలని అంటారన్నారు. ప్రమాణం అంటే ఆనందం, వేదం, ఆచార్యులు వీరిని సేవించాలన్నారు. స్వామిని ఎప్పుడు అమ్మవారితో దర్శనం చేసుకుంటే వరాల జల్లు కురిపిస్తారన్నారు. ఉపన్యాసకులుగా గుదిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామి, ఆధ్యాత్మికవేత్త కైలాష్నాధ్ పాల్గొన్నారు. అతిధులుగా ఛైర్మన్ న్యూ హైపరవ్ కమిటి జస్టిస్ యు. దుర్గాప్రసాదరావు, సి.సి.యల్. ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్ చల్లా రాజేంద్రప్రసాద్, సాహితీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి యస్.వి.యస్. లక్ష్మీనారాయణ, లింగంశెట్టి ఈశ్వరరావు, మర్రెడ్డి రామకృష్ణారెడ్డి, దేవినేని కరుణచంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఆలయ అర్చక స్వాములు పి. మాధవస్వామి బృందం ఆధ్వర్యంలో మేళతాళాలతో వేదమంత్రాల నడుమ కళ్యాణాన్ని అంగరంగవైభవంగా నిర్వహించారు. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ, ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు సూర్యదేవర వెంకటేశ్వరరావు, సహాయకార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, కన్నెగంటి బుచ్చయ్యచౌదరి, బండారు సాంబశివరావు తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించి అతిధుల సత్కారం నిర్వహించారు.


























కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన - 25.10.2025

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ - 17.07.2025

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయంలో బుధవారం శ్రీవారికి అత్యంత వైభవోపేతంగా తిరుప్పావడసేవ కార్యక్రమం జరిగింది. తొలుత వేదపండితులు మాధవస్వామి బృందం ఆధ్వర్యంలో స్వామి ఉత్సవమూర్తులకు విశేష అర్చనలు, అభిషేకాలు, అలంకరణ జరిగాయి. స్వామి దివ్యదృష్టి పడే విధంగా మహామండపంలో పెద్ది శ్రీనివాసరావు, శ్రీలత దంపతులు సమర్పించిన మేల్‌చాట్ వస్త్రం, చిత్రాన్న రాశిలో జిలేబి, వడ, అప్పాలు, లడ్డులు, దోశలులను ఒక దీర్ఘ చతురస్రాకారంగా 18 అంగుళాల ఎత్తున ఏర్పాటు చేశారు. అష్టదిక్కులు, ఆరాధనలు జరిపి వివిధ రకాల పూలమాలతో తిరుప్పావడపై అలంకరించారు. వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీనివాస గద్యాన్ని శ్రవణానందంగా పఠించారు. అధిక సంఖ్యలో భక్తులు తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు. ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, సభ్యులు, భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

వైభవంగా పుష్పయాగం - 06.11.2025

వైభవంగా పుష్పయాగం - 06.11.2025 బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ పాలకవర్గం సహాయ, సహకారాలతో కొండబోలు శివరామప్రసాద్, ఉమాశంకర్ దంపతుల సౌజన్యంతో కార్తికమా సాన్ని పురస్కరించుకొని పుష్పయాగం జరిగింది. తొలుత మూలవిరాట్టుకు పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పూజలు, అలంకరణ జరి గాయి. చామంతి, గులాబీ, లిల్లీ, కలువలు, మల్లెలు, మరువం, జాజి పూలు, తులసీ దళాలతో పుష్ప యాగో త్సవం జరిగింది. ఈసందర్భంగా స్వామివారికి బంగారు పంచె కోసం శివరామప్రసాద్, ఉమాశంకర్ దంప తులు రూ.50 వేలు సమర్పించారు. సాహితీవేత్త నారాయణం ప్రసాదాచార్యులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మునిపల్లె రమణి భక్తి గీతాలాపన చేశారు.