హరిహరాత్మకమైనది కార్తీకం కార్తీకమాసం హరి , హరనామ స్మరణకు అత్యంత విశిష్టమైనదని ప్రముఖ సాహితీవేత్త సారస్వత కళానిధి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం ముకుందమాలపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ నాగరాజ్యలక్ష్మి ప్రవచనం చేస్తూ శివ , కేశవ నామాలు రెండు పవిత్రమైనవని , ఏ నామాన్ని జపించిన జీవుడు సద్గతిని పొందగలడని వివరిస్తూ సంస్కృతంతో స్తోత్ర రాజంగా పేరు పొందిన కులశేఖరాళ్వారులవారి ముకుందమాల స్తోత్రంలోని భక్తి తత్పరతను సోదాహరణంగా వివరించారు.
భక్తిశ్రద్ధలతో శ్రావణ శుక్రవార పూజలు
శ్రావణమాసం మూడవ శుక్రవారాన్ని పురస్కరించుకొని స్థానిక బృందావన్ గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని అమ్మవారికి విశేషాలు అభిషేకాలు, కుంకుమార్చన, అలంకరణ జరిగాయి. భక్తులు అమ్మవారికి సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమ పూజలు, వివిధ పుష్పాలతో అలంకరణ నిర్వహించారు


కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి