భక్తిశ్రద్దలతో చండీహోమం స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో విశ్వశాంతిని కాంక్షిస్తూ గురువారం చండీహోమం భక్తిశ్రద్ధ లతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతులచే తొమ్మిది మంది వేదపం డితుల నిర్వహణలో గణ పతికి, శివలింగానికి, నవ గ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీ గణపతి, చండీ హోమాలు నిర్వహించి, పూర్ణాహుతి చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటి అధ్యక్షుడు సిహెచ్. మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శులు ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో శ్రావణ శుక్రవార పూజలు
శ్రావణమాసం మూడవ శుక్రవారాన్ని పురస్కరించుకొని స్థానిక బృందావన్ గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని అమ్మవారికి విశేషాలు అభిషేకాలు, కుంకుమార్చన, అలంకరణ జరిగాయి. భక్తులు అమ్మవారికి సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమ పూజలు, వివిధ పుష్పాలతో అలంకరణ నిర్వహించారు
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి