హరిహరాత్మకమైనది కార్తీకం కార్తీకమాసం హరి , హరనామ స్మరణకు అత్యంత విశిష్టమైనదని ప్రముఖ సాహితీవేత్త సారస్వత కళానిధి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం ముకుందమాలపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ నాగరాజ్యలక్ష్మి ప్రవచనం చేస్తూ శివ , కేశవ నామాలు రెండు పవిత్రమైనవని , ఏ నామాన్ని జపించిన జీవుడు సద్గతిని పొందగలడని వివరిస్తూ సంస్కృతంతో స్తోత్ర రాజంగా పేరు పొందిన కులశేఖరాళ్వారులవారి ముకుందమాల స్తోత్రంలోని భక్తి తత్పరతను సోదాహరణంగా వివరించారు.
వైభవంగా వరలక్ష్మి వ్రతం - సంపదలివ్వు తల్లీ...
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, పద్మావతి కల్యాణమండపం వేదికగా ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సి.హెచ్ మస్తానయ్య, పాలకమండలి వారి అద్వర్యంలో ఆలయ ప్రధాన పూజారి మాధవస్వామి బృందం వరలక్ష్మి వ్రతాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. మూడు వందల మందికి పైగా సువాసినులచే శుక్రవారం వ్రతాలు కుంకుమార్చనలు, పారాయణలు నిర్వహించారు. పూజలో పాల్గొన్న భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు.

.jpeg)



కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి