భక్తిశ్రద్ధలతో చండీ హోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణం లో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో పౌర్ణమి, దత్త జయంతి సందర్భంగా గురు వారం చండీ హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులు తొమ్మిది మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవ గ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. కాంటినెంటల్ కాఫీ అధినేత చల్లా రాజేంద్రప్రసాద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య పాల్గొన్నారు.
వైభవంగా వరలక్ష్మి వ్రతం - సంపదలివ్వు తల్లీ...
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, పద్మావతి కల్యాణమండపం వేదికగా ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సి.హెచ్ మస్తానయ్య, పాలకమండలి వారి అద్వర్యంలో ఆలయ ప్రధాన పూజారి మాధవస్వామి బృందం వరలక్ష్మి వ్రతాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. మూడు వందల మందికి పైగా సువాసినులచే శుక్రవారం వ్రతాలు కుంకుమార్చనలు, పారాయణలు నిర్వహించారు. పూజలో పాల్గొన్న భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు.

.jpeg)



కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి