భక్తిశ్రద్ధలతో చండీ హోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణం లో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో పౌర్ణమి, దత్త జయంతి సందర్భంగా గురు వారం చండీ హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులు తొమ్మిది మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవ గ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. కాంటినెంటల్ కాఫీ అధినేత చల్లా రాజేంద్రప్రసాద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య పాల్గొన్నారు.
అలరించిన చిన్నారుల నృత్యాలు
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం అన్నమయ్య కళావే దికపై శనివారం శ్రీ లలితా నృత్యాలయ అకాడమీ తృతీయ వార్షికోత్సవం నిర్వహిం చారు. ప్రసన్నలక్ష్మీ ఉద్దిశెట్టి అధ్యక్షత వహిం చగా, దక్షిణ డీఎస్పీ భానోదయ, శ్రీపాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల కార్యదర్శి పాటిబండ్ల విష్ణువర్ధన్, అకడమిక్ డైరెక్టర్ లేళ్ల కృష్ణవేణి, ఆలయ పాలక మండలి సంయుక్త కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. చిన్నారుల శాస్త్రీయ నృత్యాలు ఆహుతులను అలరిం చాయి. అనంతరం చిన్నారులకు జ్ఞాపికలు అందించారు.

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి