హరిహరాత్మకమైనది కార్తీకం కార్తీకమాసం హరి , హరనామ స్మరణకు అత్యంత విశిష్టమైనదని ప్రముఖ సాహితీవేత్త సారస్వత కళానిధి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం ముకుందమాలపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ నాగరాజ్యలక్ష్మి ప్రవచనం చేస్తూ శివ , కేశవ నామాలు రెండు పవిత్రమైనవని , ఏ నామాన్ని జపించిన జీవుడు సద్గతిని పొందగలడని వివరిస్తూ సంస్కృతంతో స్తోత్ర రాజంగా పేరు పొందిన కులశేఖరాళ్వారులవారి ముకుందమాల స్తోత్రంలోని భక్తి తత్పరతను సోదాహరణంగా వివరించారు.
అలరించిన చిన్నారుల నృత్యాలు
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం అన్నమయ్య కళావే దికపై శనివారం శ్రీ లలితా నృత్యాలయ అకాడమీ తృతీయ వార్షికోత్సవం నిర్వహిం చారు. ప్రసన్నలక్ష్మీ ఉద్దిశెట్టి అధ్యక్షత వహిం చగా, దక్షిణ డీఎస్పీ భానోదయ, శ్రీపాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల కార్యదర్శి పాటిబండ్ల విష్ణువర్ధన్, అకడమిక్ డైరెక్టర్ లేళ్ల కృష్ణవేణి, ఆలయ పాలక మండలి సంయుక్త కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. చిన్నారుల శాస్త్రీయ నృత్యాలు ఆహుతులను అలరిం చాయి. అనంతరం చిన్నారులకు జ్ఞాపికలు అందించారు.

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి