మనదేశంలో మహిళలకు గౌరవ స్థానం స్త్రీలను గౌరవించే సమాజం అభివృద్ధి చెందుతుందని, అందుకే తొలినాళ్ల నుంచి మనదేశంలో మహిళలకు గౌరవ స్థానమిచ్చారని నిఘంటు రచయిత పెద్ది సాంబశివరావు పేర్కొన్నారు. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న విశిష్ట మహిళలను గుళ్లపల్లి సుబ్బారావు సేవాసంస్థ ఆధ్వర్యంలో బృందావన్ గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానంలోని అన్నమయ్య కళావేదికపై సోమవారం రాత్రి సత్కరించారు. న్యాయవాది, రచయిత్రి నల్లూరి రుక్మిణి, గాయత్రి మహిళా సంగీత సన్మండలి ప్రధాన కార్యదర్శి ఎంవై శేషురాణి, బుర్రకథ కళాకారిణి యడవల్లి శ్రీదేవిలను శాలువా, జ్ఞాపిక, సన్మాన పత్రాలతో నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో ఎం. వేదవతి, గుళ్లపల్లి స్వాతి, గుళ్లపల్లి రాఘవేంద్రరావు, దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య, అర్థలపూడి నేహా తదితరులు పాల్గొన్నారు. యడ వల్లి శ్రీదేవి బృందం బుర్రకథ ఆకట్టుకుంది.
అలరించిన చిన్నారుల నృత్యాలు
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం అన్నమయ్య కళావే దికపై శనివారం శ్రీ లలితా నృత్యాలయ అకాడమీ తృతీయ వార్షికోత్సవం నిర్వహిం చారు. ప్రసన్నలక్ష్మీ ఉద్దిశెట్టి అధ్యక్షత వహిం చగా, దక్షిణ డీఎస్పీ భానోదయ, శ్రీపాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల కార్యదర్శి పాటిబండ్ల విష్ణువర్ధన్, అకడమిక్ డైరెక్టర్ లేళ్ల కృష్ణవేణి, ఆలయ పాలక మండలి సంయుక్త కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. చిన్నారుల శాస్త్రీయ నృత్యాలు ఆహుతులను అలరిం చాయి. అనంతరం చిన్నారులకు జ్ఞాపికలు అందించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి