లలిత కళలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి
లలిత కళలను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని గుంటూరు వెస్ట్ డీఎస్పీ భానోదయ తెలిపారు. శ్రీ లలితా నృత్యాలయ అకాడమీ తృతీయ వార్షికోత్సవం శనివారం అన్నమయ్య కళావేదిక శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కనుల పండుగగా జరిగాయి. ఈ వేడుకలలో గుంటూరు వెస్ట్ డీఎస్పీ భానోదయ, పాటి బండ్ల సీతారామయ్య హైస్కూల్ నెక్రటరీ, కరస్పాండెంట్ పాటిబండ్ల విష్ణువర్ధన్, అకడమిక్ డైరెక్టర్ లేళ్ళ కృష్ణవేణి, ఆలయ పాలక మండలి జాయింట్ సెక్రటరీ ఊటుకూరి నాగేశ్వరరావు అతిధులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, చిన్నారులకు జ్ఞాపికలు అందచేశారు. చిన్నారులు చేసిన శాస్త్రీయ నృత్యాలు ఆహుతులను అల రించాయి. శాస్త్రీయ నృత్య కళ ద్వారా భారతీయ సంస్కృతి వారసత్వపు నిజమైన సారాన్ని ప్రోత్సహించడం, పరిరక్షించడం అభినందనీయమని అతిథులు అన్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి