హరిహరాత్మకమైనది కార్తీకం కార్తీకమాసం హరి , హరనామ స్మరణకు అత్యంత విశిష్టమైనదని ప్రముఖ సాహితీవేత్త సారస్వత కళానిధి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం ముకుందమాలపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ నాగరాజ్యలక్ష్మి ప్రవచనం చేస్తూ శివ , కేశవ నామాలు రెండు పవిత్రమైనవని , ఏ నామాన్ని జపించిన జీవుడు సద్గతిని పొందగలడని వివరిస్తూ సంస్కృతంతో స్తోత్ర రాజంగా పేరు పొందిన కులశేఖరాళ్వారులవారి ముకుందమాల స్తోత్రంలోని భక్తి తత్పరతను సోదాహరణంగా వివరించారు.
యోగాసన ప్రదర్శన, భక్తిగీతాలాపన
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారము ప్రపంచ యోగా దినోత్సవము, ప్రపంచ సంగీత దినోత్సవము సందర్భంగా యోగాచార్య డాక్టర్ రెడ్డి సాంబశివరావు గారి శిష్యబృందంచే యోగాసన ప్రదర్శనలు, పరమేశ్వరి పాటల పల్లకి వారి ఆధ్వర్యములో శ్రీమతి యన్. పరమేశ్వరి బృందంచే భక్తిగీతాలాపన కార్యక్రమం జరిగింది.


.jpeg)
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి