భక్తిశ్రద్ధలతో చండీ హోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణం లో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో పౌర్ణమి, దత్త జయంతి సందర్భంగా గురు వారం చండీ హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులు తొమ్మిది మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవ గ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. కాంటినెంటల్ కాఫీ అధినేత చల్లా రాజేంద్రప్రసాద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య పాల్గొన్నారు.
యోగాసన ప్రదర్శన, భక్తిగీతాలాపన
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారము ప్రపంచ యోగా దినోత్సవము, ప్రపంచ సంగీత దినోత్సవము సందర్భంగా యోగాచార్య డాక్టర్ రెడ్డి సాంబశివరావు గారి శిష్యబృందంచే యోగాసన ప్రదర్శనలు, పరమేశ్వరి పాటల పల్లకి వారి ఆధ్వర్యములో శ్రీమతి యన్. పరమేశ్వరి బృందంచే భక్తిగీతాలాపన కార్యక్రమం జరిగింది.


.jpeg)
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి