పంచభూతాలలో విశిష్టమైనది వాయువు
పంచభూతాలలో వాయువు ఎంతో విశిష్టమైనదని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వెలువోలు నగరాజ్యలక్ష్మి అన్నారు. స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర్వస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, మహిళా విభాగం వారి కార్యక్రమం గురువారం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు శ్రీ చిటిపోతు మస్తానయ, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి ప్రసంగిస్తూ ప్రాణి మనుగడకు ఊపిరి వాయువన్నారు, మన పూర్వీకులు వాయువును దేవతాశక్తిగా భావించి పూజించారని వేద సూత్రాలతో సోదాహరణంగా వివరించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రముఖ కథారచయిత్రి శ్రీమతి గోటేటి లలితాశేఖర్ నేటికథ - ఈనాటి మహిళ అనే అంశంపై ప్రసంగం చేశారు. డాక్టర్ మైలవరపు లలితకుమారి, విజయలక్ష్మి, డాక్టర్ మాధవపెద్ది విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి