అలరించిన సినీ సంగీత విభావరి
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికగా కళాంజలి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సినీసంగీత విభావరి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సి.హెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు లు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.గాయని గాయకులు బాల కామేశ్వరరావు, సత్యవర్ధన్, షేక్. రసూల్బాబు, ఆర్. సాంబశివరావు ,పి.గాయత్రి లు తమ గాత్ర ధారణలో అలనాటి మేటి చిత్రాలలోని పలు మధురగీతాలను శ్రావ్యంగా ఆలపించారు. కీబోర్డ్ప కే.రవిబాబు, తబలపై విజయ్పైల్, పాడ్స్పై రవి లు వాయిద్య సహకారం అందించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు తొట్టెంపూడి రమేష్ ఆధ్వర్యంలో కళాకారులను, అతిధులను సత్కరించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి