విశ్వశాంతి కాంక్షిస్తూ చండీహోమం
బృం దావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీ ధార్మిక విజ్ఞాన పరి షత్ ఆధ్వర్యంలో విశ్వశాంతి కాంక్షిస్తూ మంగళవారం రాత్రి చండీహోమం భక్తిశ్రద్ధలతో చేశారు. పరిషత్ అధ్యక్షుడు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతుల నిర్వహణలో 9 మంది వేద పండితులు గణపతి, శివలింగం, నవగ్రహాలకు అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు చేసి పూర్ణాహుతి జరిపారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య, ఉపాధ్య క్షుడు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యద ర్శులు ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి