వైభవంగా శ్రీవారి కల్యాణం
స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై బుధవారం అక్షయ తిధి సందర్భంగా లోక కల్యాణం కాంక్షిస్తూ మర్రెడ్డి రామకృష్ణారెడ్డి మృదుల దంపతులు, బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతులు, ఆలయ పాలకమండలి సహకారంతో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. తిరుపతి బ్రహ్మోత్సవ వ్యాఖ్యాత నారాయణం ప్రసాదాచార్యుల వారి విశేష వ్యాఖ్యానంతో ఆలయ అర్చకులు పరుచూరి మాధవస్వామి, పరాశరం కృష్ణకిషోర్ బృందం నిర్వహణలో బృందావన శ్రీనివాసుని కల్యాణం నిర్వహించారు. తొలుత రాష్ట్ర ప్రభుత్వ హంస, కళారత్న పురస్కారం అందుకున్న ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్యను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో శ్రీహరిబాబు బృందంచే అన్నమయ్య సంకీర్తనల గానం, కోలాటం, తాళంభజన వంటి అనేక కార్యక్రమాలతో ప్రాంగణం కిక్కిరిసిన భక్తులతో కళకళలాడింది.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి