ముగిసిన మహా మంజీర నాదం నృత్యోత్సవాలు
: స్థానిక బృందావన్గార్డె న్స్, శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, అన్నమయ్య కళావేదికపై వారం రోజుల పాటు జరిగిన మహా మంజీర నాదం మంగళవారంతో వైభవంగా ముగిసాయి. అంతర్జాతీయ దినోత్సవం పురస్కరించుకొని నటరాజ పూజ, అనంతరం నటరాజ స్వామి వందన రఘు నందన అనే త్యాగరాజ కీర్తనకు 200 మంది కళాకారులు నృత్యర్చన చేశారు. సాయంత్రం జరిగిన సభను ఆలయ అధ్యక్షుడు మస్తానయ్య ప్రారభించగా, సభకు భూసురపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా, పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జరిగిన నృత్య కార్యక్రమంలో రాజమో హన్(కేరళ) మోహిని అట్టం, అవిజిత్ కుందు (బెంగళూరు) భరతనా ట్యంను ప్రదర్శించి ప్రేక్షకులను రంజింపజేశారు. కళారత్న పురస్కారాన్ని అందుకున్నందుకు డాక్టర్ కాజ వెంకట సుబ్రహ్మణ్యంకు పసుమర్తి కృష్ణమూర్తి స్మారక జీవిత సాఫల్య శత గురు జయంతి పురస్కారాన్ని ఆయన శిష్యులు, ప్రముఖులు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి