ఆకట్టుకున్న గోదా కల్యాణం నృత్య రూపకం
బృందావన్ గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై శ్రీసాయి మంజీర కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నృత్యోత్సవాలు సోమవారం కొనసా గాయి. మహా మంజీరనాదం పేరున జరిగిన ఉత్సవంలో గోదా కల్యాణం నృత్యరూపకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. పుట్టగుంట ప్రభాకరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభకు సంస్థ అధ్యక్షుడు డాక్టర్ భూసురవల్లి వెంకటే శ్వర్లు అధ్యక్షత వహించారు. సభలో ఐటీ నిపుణుడు మానం బ్రహ్మయ్య, నాట్యాచార్య డాక్టర్ కాజా వెంకట సుబ్రహ్మణ్యం తదితరులు సీనియర్ మేకప్ కళాకారుడు ఆచారి (పసుపులేటి మద్దిలేటి)ని 'అపురూప రూపశిల్పి' పురస్కారంతో సత్కరించారు. కార్యక్రమాలను వెంకటగిరి నాగలక్ష్మి, తాళ్లూరి ధరణి తాళ్లూరి చక్రవర్తి తదితరులు పర్యవేక్షించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి