నేత్రానందం నృత్యాభినయనం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై జరుగుతున్న మహామంజీర నాదం ఐదో రోజుకు చేరుకున్నాయి. ఆదివారం కార్యక్రమాల్ని విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య ప్రారంభించగా, సంస్థ అధ్యక్షుడు డాక్టర్ భూసురవల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. సభలో తిరుపతి ఎస్వీ సంగీత నృత్య కళాశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు డాక్టర్ ఎస్.జమునారాణి, సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ కాజా వెంకట సుబ్రహ్మణ్యం, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వర రావు తదితరులు పాల్గొని తిరుపతి ఎస్వీ సంగీత నృత్య కళాశాల విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు అరవీటి ప్రభావతి, విశ్రాంత నృత్య శాఖాధిపతి దేవేంద్ర పిళ్ళై లను మరంగంటి కాంచనమాల జీవిత సాఫల్య పురస్కా రంతో ఘనంగా సత్కరించారు. సభానంతరం పశ్చిమ బెంగాల్కు చెందిన ప్రముఖ నృత్య కళాకారుడు ఎస్ కె బాదుషా మణిపురి నాట్యాన్ని, భువనేశ్వ ర్కు చెందిన గోకుల్ కృష్ణ ఒడిస్సీ నృత్యాన్ని, తిరుపతికి చెందిన డాక్టర్ శరత్ చంద్ర భరతనాట్యాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నా రు. కార్యక్రమాలను వెంకటగిరి నాగలక్ష్మి, పఠాన్ మొహిద్దిన్ పర్యవేక్షించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి