అలరించిన నృత్య నీరాజనం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళా వేదికపై శ్రీసాయి మంజీర కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో 15వ అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా శనివారం మహా మంజీరనాదం పేరున విభిన్న రాష్ట్రాల నృత్యాలు ప్రదర్శితమయ్యాయి. తొలుత ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించగా.. సంస్థ అధ్య క్షుడు భూసురవల్లి వెంకటేశ్వర్లు సభకు అధ్య క్షత వహించారు. వీవీఐటీ విద్యా సంస్థల అధినేత వాసిరెడ్డి విద్యాసాగర్, రామరాజు ఫౌండేషన్ అధ్యక్షుడు రామరాజు శ్రీనివాసరావు, ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి, నాట్యాచార్య డాక్టర్ కాజ వెంకట సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొని కళాకారులను యువ కళారత్న పురస్కారంతో సత్కరించారు. అనంతరం కర్ణాటకకు చెందిన నృత్య కళాకారిణి సుమంగళ ప్రభు పలు కీర్తనలకు భరతనాట్యం, హైదరాబాద్కు చెందిన నాట్యా చారిణి జేపీ కనిష్క కూచిపూడి, కోల్తాకతకు చెందిన నాట్య గురువు దేణని బసు కథక్ నృత్యాన్ని ప్రదర్శించారు. కార్యక్రమాలను వెంకటగిరి నాగలక్ష్మి, పచ్చల నాగ మహిత తదితరులు పర్యవేక్షించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి