మంజీర నాదాలు..అభినయ నర్తనలు
స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో అన్నమయ్య కళావేదికపై జరుగుతున్న మహా మంజీర నాదం-2025 శుక్రవారం నాటికి మూడో రోజుకు చేరుకున్నాయి. కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు ప్రారంభించగా, సభకు డాక్టర్ భూసురపల్లి వేంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. అనంతరం జరిగిన నృత్య ప్రదర్శనలలో స్వాతి ఆత్మనాథన్ (వారణాసి) భరతనాట్యాన్ని, హర్షిత ఎస్వీఆర్(హోన్నవర్, కర్ణాటక) కన్నడ యక్షగాన, సంపూర్ణ రాజ్యలక్ష్మి కూచిపూడి నృత్యం ప్రేక్షకులను రసానందంలో ఓలలాడించాయి. కళాకారులను సంస్థ కార్యదర్శి డాక్టర్ కాజ వెంకట సుబ్రహ్మణ్యం యువ కళారత్న పురస్కారంతో ఘనంగా సత్కరించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి