రెండో రోజు కొనసాగిన మహా మంజీరనాదం
బృందావన్ గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానం అన్నమయ్య కళావేదికపై 15వ అంతర్జాతీయ నృత్య దినోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న మహా మంజీరనాదం- 2025 గురువారం రెండో రోజుకి చేరాయి. శ్రీసాయి మంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో జరగ్గా, పాలకమండలి ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. సంస్థ అధ్యక్షుడు భూసురపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. అనంతరం ఆతీరా ఎ.వర్మ (కొట్టాయం, కేరళ) కూచిపూడి నృత్యాన్ని, లక్ష్మీనాయర్ (తిరువనంతపురం, కేరళ) మోహిని ఆట్టం నృత్యం, పేరిణి కిరణ్(హైదరాబాద్) పేరిణి నృత్యాన్ని ప్రదర్శించారు. కళారత్న రాయన గిరిధర్ గౌడ్ మాట్లాడగా, కళాకారులను యువకళారత్న పురస్కారాలతో సంస్థ కార్యదర్శి కళారత్న డాక్టర్ కాజ వెంకటసుబ్రహ్మణ్యం సత్కరించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి