ఆకట్టుకున్న నృత్యప్రదర్శన
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై రాధామాధవ కల్చరల్ అసోషియేషన్ ఆధ్వర్యంలో 319వ నెలనెలా వెన్నెల సందర్భంగా ఆదివారం జరిగిన నృత్యప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత పారిశ్రామికవేత్త మిట్టపల్లి రమేష్బాబు తదితరులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పలు నాట్యగు రువులు బెళ్ళగుబ్బల అనితారావ్, బి.శారద, చింత వెంకట శివరామకృష్ణకుమార్, టి.సాయిమాధవి, చింతల భ్రమరాంబిక, అనంతుల విజయకుమారిలను నాట్యసారధి అవార్డుతో వారి శిష్యులకు నాట్యరంజని అవార్డుతో ఘనంగా సత్కరించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి