ఆదర్శ కావ్యం శ్రీరామచరిత మానసం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శ్రీ రామచరిత మానసం గ్రంథంపై ఆధ్యాత్మిక ప్రవచనాన్ని గురువారం నిర్వహించారు. ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆధ్యాత్మికవేత్త చిమట రాఘవరావు ప్రవచనం చేశారు. ఉత్తర భారతదేశంలో శ్రీరామచరిత మానసానికి ఉన్నంత ప్రాశస్తి, ప్రాచుర్యం మరే ఏ గ్రంథానికీ లేదనడంలో అతిశయోక్తి లేదని తెలిపారు. శ్రీరామచంద్రుని చరిత్ర నిర్మలమైన మానస సరోవరం వంటిదని పేర్కొన్నారు. అపూర్వ భావాన్ని తులసీ దాసు ఈ కావ్య నామధేయం ద్వారా లోకానికి వెల్లడించారని చెప్పారు. వివిధ భాషలలో వెల సిన రామాయణ కావ్యాలలో గోస్వామి తులసీ దాసు రచించిన శ్రీరామచరిత మానసం కావ్యం ఆదర్శమైనదని పేర్కొన్నారు. జాతిపిత గాంధీ మహాత్ముడు తులసీదాస్ రామాయ ణాన్ని అన్ని భక్తి సాహిత్యాలలో గొప్ప గ్రంథం గా భావిస్తున్నట్లు ఆయన తెలిపారని రాఘవ రావు గుర్తు చేశారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి