ఘనంగా అన్నమాచార్య జయంత్యుత్సవం బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై గాయత్రీ మహిళా మండలి ఆధ్వర్యంలో తాళ్లపాక అన్నమాచార్య జయంత్యుత్సవం శనివారం రాత్రి జరిగింది. తొలుత కార్యక్రమాలను ఛాతీ సంబంధ వ్యాధుల చికిత్స నిపుణుడు డాక్టర్ శ్రీకంటి రఘు, మైధిలి దంపతులు, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, భూసురపల్లి వెంకటేశ్వర్లు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు మల్లాది సూరిబాబును సత్కరించారు. మల్లాది సోదరులు శ్రీరామప్రసాద్, రవికుమార్ల శాస్త్రీయ సంగీత గాత్ర కచేరీ జరిగింది. సంస్థ అధ్యక్షు రాలు డాక్టర్ పి.విజయ, ప్రధాన కార్యదర్శి ఎం.వై. శేషురాణి, ఉపాధ్యక్షురాలు డాక్టర్ ఎం. రాజరాజేశ్వరి, మాధవపెద్ది మీనాక్షి, పాటిబండ లలితాదేవి, కార్యదర్శి ఏవీ మంగాదేవి, కోశాధికారి డాక్టర్ మాధవపెద్ది విజయలక్ష్మి కళాకారులు, అతిథులను సత్కరించారు.
‘గుంటూరు తిరుమల’ బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై 04.10.2024 శుక్రవారం ఉదయం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అన్నమయ్య కళావేదికపై యం.వై.శేషురాణి, భువనేశ్వరి గార్లచే దేవీ కీర్తనల గానం సుమధురంగా సాగింది. తంగిరాల అన్నపూర్ణ (ఏ.ఐ.ఆర్. ఆర్టిస్ట్) వ్యాఖ్యానం అందించారు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి