ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

అలరించిన భక్తి సంగీత విభావరి - 07.06.2025

అలరించిన భక్తి సంగీత విభావరి స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం సాయంత్రం హైదరాబాదు వాస్తవ్యులు శ్రీవాణీ కళానికేత్ నిర్వాహకులు , ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ విశ్రాంత సీనియర్ బ్రాంచి మేనేజర్ , ఆకాశవాణి , దూరదర్శన్ కళాకారులు శ్రీ భాగినారాయణశాస్త్రి గారిచే కర్ణపేయమైన అనేక భక్తిగీతాలు , శ్రీ అన్నమాచార్యుల సంకీర్తనలు గానం చేసి ఆహుతులను ఆకట్టుకున్నారు. తొలుత ఆలయ అధ్యక్షులు సిహెచ్. మస్తానయ్య , ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భాగినారాయణశాస్త్రిచే వెండికొండ మీద ఉన్న,  తిరుపతి వేంకట రమణ , హరే వేంకట రమణ బ్రోవరా , సప్తగిరులపై వెలసి వేంకటేశ , నామేను పులకించె ఈ జన్మ తరియించే అంటూ అనేక భక్తిగీతాలతో పాటు , మాధవా కేశ మధుసూదన , ఇందరికీ అభయంబు ఇచ్చుచేయి , నానాటి బ్రతుకు నాటకము , రంగ రంగ రంగపతి రంగనాధ్ , చూడరమ్మ సతులాలా అంటూ పలు అన్నమయ్య కీర్తనలు శ్రవణానందకరంగా ఆలపించి కచేరిని రక్తికట్టించారు. వీరికి వయోలిన్‌పై పి.యస్.ఆర్. ఆంజనేయశాస్త్రి, కీబోర్డుపై బి.యస్. సత్యదే...
ఇటీవలి పోస్ట్‌లు

భక్తితోనే పురుషోత్తమప్రాప్తి - సువీరానందస్వామి, చిన్మయమిషన్ - 02.06.2025 - 06.06.2025

భక్తితోనే పురుషోత్తమప్రాప్తి అనన్య భక్తితోనే పరమాత్ముడైన పురుషోత్తముని చేరవ చ్చని చిన్మయ మిషన్ సువీరానంద స్వామి తెలిపారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై బండ్లమూడి విజయలక్ష్మి సౌజన్యంతో భగవద్గీత 15వ అధ్యాయంలోని పురుషోత్తమ ప్రాప్తియోగంపై ప్రవచనాలు సోమవారం రాత్రి ప్రారంభమయ్యాయి. తొలుత ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సువీరానందస్వామి ప్రవచనాలు చెప్తూ.. భక్తి ద్వారా త్రిగుణాలు దాటవచ్చని, బ్రహ్మ సాక్షాత్కారం పొందవచ్చని వివరించారు. 

అలరించిన జానపద నృత్యాలు - 01.06.2025

అలరించిన జానపద నృత్యాలు  బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో రాధామాధవ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జరిగిన జానపద నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. తొలుత ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాట్యాచార్య షేక్ ఖలీల్ నృత్య దర్శకత్వంలో పలువురు చిన్నారులు జానపద నృత్యాంశాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. 

అలరించిన చిన్నారుల నృత్యాలు - 31.05.2025

అలరించిన చిన్నారుల నృత్యాలు  స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం అన్నమయ్య కళావే దికపై శనివారం శ్రీ లలితా నృత్యాలయ అకాడమీ తృతీయ వార్షికోత్సవం నిర్వహిం చారు. ప్రసన్నలక్ష్మీ ఉద్దిశెట్టి అధ్యక్షత వహిం చగా, దక్షిణ డీఎస్పీ భానోదయ, శ్రీపాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల కార్యదర్శి పాటిబండ్ల విష్ణువర్ధన్, అకడమిక్ డైరెక్టర్ లేళ్ల కృష్ణవేణి, ఆలయ పాలక మండలి సంయుక్త కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. చిన్నారుల శాస్త్రీయ నృత్యాలు ఆహుతులను అలరిం చాయి. అనంతరం చిన్నారులకు జ్ఞాపికలు అందించారు. 

లలిత కళలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి - 30.05.2025

లలిత కళలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి  లలిత కళలను ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలని గుంటూరు వెస్ట్ డీఎస్పీ భానోదయ తెలిపారు. శ్రీ లలితా నృత్యాలయ అకాడమీ తృతీయ వార్షికోత్సవం శనివారం అన్నమయ్య కళావేదిక శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కనుల పండుగగా జరిగాయి. ఈ వేడుకలలో గుంటూరు వెస్ట్ డీఎస్పీ భానోదయ, పాటి బండ్ల సీతారామయ్య హైస్కూల్ నెక్రటరీ, కరస్పాండెంట్ పాటిబండ్ల విష్ణువర్ధన్, అకడమిక్ డైరెక్టర్ లేళ్ళ కృష్ణవేణి, ఆలయ పాలక మండలి జాయింట్ సెక్రటరీ ఊటుకూరి నాగేశ్వరరావు అతిధులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, చిన్నారులకు జ్ఞాపికలు అందచేశారు. చిన్నారులు చేసిన శాస్త్రీయ నృత్యాలు ఆహుతులను అల రించాయి. శాస్త్రీయ నృత్య కళ ద్వారా భారతీయ సంస్కృతి వారసత్వపు నిజమైన సారాన్ని ప్రోత్సహించడం, పరిరక్షించడం అభినందనీయమని అతిథులు అన్నారు.

ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలి - 28,29.05.2025

ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలి స్థానిక బృందావన్గార్డెవ్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై బుధవారం భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదిత్య హృదయ పారాయణం, శృంగార నైషధంపై ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు సీహెచ్ మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఆధ్యాత్మిక ప్రవచకురాలు డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి ప్రవచిస్తూ పాకిస్థాన్ యుద్ధంలో భారత దేశమే పైచేయి కావాలని అన్నారు. కోవిడ్-19 బారిన పడకుండా ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు. భాగవత గోష్ఠితో మూడుసార్లు ఆదిత్య హృదయ పారాయణం నిర్వహించారని అన్నారు. అనంతరం శృం గార నైషధంలోని ఇతివృత్తాన్ని వివరించారు. 

తెలుగు పంచకావ్యాలలో శృంగార నైషధం మొదటిది - 27.05.2025

తెలుగు పంచకావ్యాలలో శృంగార నైషధం మొదటిది శ్రీనాథ మహాకవి రచించిన శృంగార నైషధం తెలుగు పంచకావ్యాలలో మొదటిదని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకురాలు డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై మంగళవారం భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వారి ఆధ్వర్యంలో శృంగార నైషధముపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ శ్రీరంగనాయకి ప్రవచిస్తూ శృంగార నైషధం నల, దమయంతిల ప్రేమకథను వర్ణిస్తుందన్నారు. నలరాజు, దమయంతిని వివాహం చేసుకున్న తర్వాత వారు కలిసే కథ ఇదని, ఈ కథను శ్రీహర్షుడు సంస్కృతంలో నైషధ మహాకావ్యంగా రాశాడన్నారు. శ్రీనాథుడు దాన్ని తెలుగులోకి అనువదించాడనీ, శృంగార నైషధం నల, దమయంతిల ప్రేమను, వారి జీవితంలోని వివిధ సంఘటనలను అందంగా వర్ణిస్తుందని, కథలో నలరాజు, దమయంతి నరకయాత్రా కష్టాలను ఎలా ఎదుర్కొన్నారో, వారు ఒకరినొకరు ఎలా మళ్లీ కలుసుకున్నారో వివరిస్తుందని తెలిపారు.